ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే సొంత అన్న అని తెలిసింది.. మరి ఆవిడ ఏం చేసిందో తెలుసా?!

|

Mar 31, 2023 | 7:16 AM

నాటి కాలంలో ఒక జంటకు పెళ్లి చేయాలంటే ఇరు కుటుంబాల పెద్దలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకునేవారు. ఇరు కుటుంబాల చరిత్రను తెలుసుకుని, వారి మతం, కులం, గోత్రం వంటి అన్ని వివరాలు తెలుసుకుని, అన్నీ సరిపోలితే వివాహం చేసేశారు. కానీ, నేటి యువతీ, యువకుల

ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కట్ చేస్తే సొంత అన్న అని తెలిసింది.. మరి ఆవిడ ఏం చేసిందో తెలుసా?!
Woman
Follow us on

నాటి కాలంలో ఒక జంటకు పెళ్లి చేయాలంటే ఇరు కుటుంబాల పెద్దలు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకునేవారు. ఇరు కుటుంబాల చరిత్రను తెలుసుకుని, వారి మతం, కులం, గోత్రం వంటి అన్ని వివరాలు తెలుసుకుని, అన్నీ సరిపోలితే వివాహం చేసేశారు. కానీ, నేటి యువతీ, యువకుల పెళ్లి అంటే లైట్ అనే పరిస్థితి ఉంది. కులం, మతం, గోత్రం వంటివి ఏవీ పట్టింపు లేదు. విదేశాల్లో అయితే ఈ కులం, మతం, గోత్రం అనే ముచ్చటే దాదాపుగా ఉండదు. అయితే, అదే వారికి కొన్నిసార్లు పెద్ద చిక్కును తెచ్చిపెడతాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అమెరికాలో వెలుగులోకి వచ్చింది. పెళ్లైన 17 తరువాత ఆ దంపతులిద్దరూ తోబుట్టువులు అని తేలింది. ఇప్పడిదే వైరల్‌గా మారింది.

అమెరికాలోని కొలరాడోలో నివసిస్తున్న సెలీనా (సెలీనా క్వినోన్స్) తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి తన బంధువు అని తెలియడంతో నిర్ఘాంతపోయింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. పెళ్లయిన 17 ఏళ్ల తర్వాత ఈ రహస్యం వెలుగులోకి వచ్చింది. అయితే, వీరిద్దరూ తోబుట్టువులు అయినప్పటికీ.. వారి పిల్లలలో ఎలాంటి లోపాలు లేవు. ఈ విషయాన్ని సదరు మహిళ టిక్‌టాక్‌లో షేర్ చేసింది. వీడియో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఏళ్ల నాటి సీక్రెట్ ఇలా బయటపడింది..

ఇంగ్లీష్ వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. వారిద్దరూ 2006 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. వీరు వివాహానికి ముందు 4 నెలల పాటు డేటింగ్ కూడా చేశారు. కానీ అప్పటి వరకు ఈ నిజం తెలుసుకోలేకపోయారు. పెళ్లయిన 17 ఏళ్ల తర్వాత ఇద్దరూ డీఎన్‌ఏ పరీక్ష చేయించుకోగా.. అసలు నిజం బయటపడింది. ఈ విషయం తెలియగానే వారి కాళ్లకింద భూమి కంపించిపోయింది. కానీ.. వారిద్దరూ బంధువులు అని తెలిసినా విడిపోబోమని స్పష్టం చేసింది సెలీనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..