AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway : జ్వరం కారణంగా రైలులో ప్రయాణించని వారికి డబ్బులు వాపస్..! ఎలాగో తెలుసుకోండి..

Indian Railway : కరోనా వైరస్ కారణంగా భారత రైల్వే అనేక చర్యలు తీసుకుంటుంది. రైళ్లలో రిజర్వు చేసిన సీట్లలో

Indian Railway : జ్వరం కారణంగా రైలులో ప్రయాణించని వారికి డబ్బులు వాపస్..! ఎలాగో తెలుసుకోండి..
Indian Railway
uppula Raju
|

Updated on: Jun 16, 2021 | 12:10 PM

Share

Indian Railway : కరోనా వైరస్ కారణంగా భారత రైల్వే అనేక చర్యలు తీసుకుంటుంది. రైళ్లలో రిజర్వు చేసిన సీట్లలో ప్రయాణించడంతో పాటు సామాజిక దూరానికి సంబంధించి అనేక నియమాలు రూపొందించబడ్డాయి. దీంతో పాటు రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి ప్రవేశించే ప్రతి వ్యక్తి కరోనా మార్గదర్శకాల ప్రకారం పరీక్షింపబడుతున్నారు. ఒక వ్యక్తి ఇంటి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్‌కు చేరుకుని స్టేషన్‌ స్క్రీనింగ్‌లో అనర్హులుగా భావిస్తే ఏమి జరుగుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.. స్టేషన్‌లోని స్క్రీనింగ్‌లో ప్రయాణికుల ఉష్ణోగ్రత తీసుకుంటారు. ఎక్కువగా ఉంటే ప్రయాణికులను ఆపుతారు. అటువంటి పరిస్థితిలో రైల్వే కొత్త నియమాలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం.

రైల్వే స్టేషన్ వద్ద స్క్రీనింగ్‌లో ఎవరైనా అనర్హులుగా గుర్తించబడి ప్రయాణించలేకపోతే రైల్వే అనేక నియమాలను రూపొందించింది. ఐఆర్‌సిటిసి అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన సమాచారం ప్రకారం.. రైల్వే స్టేషన్‌లో చేసిన స్క్రీనింగ్‌లో అనర్హులుగా కనిపించిన ప్రయాణికులకు టికెట్ తిరిగి ఇవ్వబడుతుంది. అంటే వారు ప్రయాణించలేకపోతే వారి టికెట్ డబ్బు తిరిగి లభిస్తుంది. రైల్వే నిబంధనల ప్రకారం కరోనా వైరస్ లక్షణాల వల్ల ప్రయాణం చేయలేకపోతే వారు టికెట్ డబ్బు పొందవచ్చు. ఎవరైనా ఒక సమూహంలో ప్రయాణించడానికి చాలా మంది కలిసి ఒక పిఎన్‌ఆర్‌లో టికెట్లు బుక్ చేసుకుంటే అటువంటి పరిస్థితిలో ప్రయాణికులందరూ డబ్బు వాపసు పొందవచ్చు.

కరోనా వైరస్ లక్షణాల కారణంగా అనర్హులుగా గుర్తించబడటం వల్ల ప్రయాణం కుదరదు. దీంతో ప్రయాణికులకు రైల్వే ద్వారా డబ్బు రిటన్ ఇవ్వబడుతుంది. ఇందుకోసం ప్రయాణికులు ప్రయాణించిన 10 రోజుల్లోపు టిడిఆర్ దాఖలు చేయాలి. ఈ డబ్బు టిడిఆర్ ద్వారా మాత్రమే ఇవ్వబడుతుంది. ప్రయాణికులు ప్రయాణించలేక 10 రోజుల్లోపు టిడిఆర్ దాఖలు చేసి ఐఆర్‌సిటిసికి టిటిఈ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ తర్వాత డబ్బు తిరిగి చెల్లించబడుతుంది.

Smoke in Intercity Train: ఇంటర్‌ సిటీ రైలు ఇంజిన్‌లో పొగలు.. ఆందోళనలో ప్రయాణికులు..

INDW vs ENGW 2021: ఏడేళ్ల తర్వాత బరిలోకి మిథాలీ సేన; ఏకైక టెస్టులో ఇంగ్లండ్ తో తలపడనున్న భారత్

Hyderabad News : హైదరాబాద్‌లో ఓ యువతిపై 22 ట్రాఫిక్ చలాన్లు..! అవాక్కయిన పోలీసులు..