సిద్దిపేట జిల్లాలో వికసించిన మానవత్వం.. ముగ్గురు కొడుకులున్నా ముందుకురానివైనం.. అంతిమ సంస్కారాలు చేసిన ముస్లిం యువకులు

|

May 31, 2021 | 7:01 AM

Muslim youth performed funeral: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కొందరు ముస్లిం సోదరులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ హిందూ వ్యక్తికి ముస్లింలు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కోవిడ్ కారణంగా మృతి...

సిద్దిపేట జిల్లాలో వికసించిన మానవత్వం.. ముగ్గురు కొడుకులున్నా ముందుకురానివైనం.. అంతిమ సంస్కారాలు చేసిన ముస్లిం యువకులు
Muslims Funeral For Hindu
Follow us on

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న కొందరు ముస్లిం యువకులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ హిందూ వ్యక్తికి వారు అంతిమ కార్యక్రమాలను నిర్వహించారు. కోవిడ్ కారణంగా మృతి చెందిన వ్యక్తికి చివరి సంస్కారాలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆ యువకులు అంత్యక్రియలు చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దాగుండవెల్లి గ్రామంలో కోవిడ్‌తో మరణించిన గట్టు బాలస్వామికి ముస్లిం యువకులు చివరి కర్మలు చేశారు. గట్టు బాలస్వామికి ముగ్గురు కుమారులు, ఇద్దర కుమార్తెలు. అయితే కుటుంబ సభ్యులు ఎవరూ చివరి కర్మలు చేయడానికి నిరాకరించారు.

దీంతో ముస్లిం యువత ముందుకు వచ్చి అంత్యక్రియలు చేశారు. పీపీఈ కిట్లు ధరించి దహన సంస్కారాలు చేశారు. ఒక హిందువుకు ఆయన సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడం పట్ల స్థానికులు అభినందించారు. సొంత కుటుంబ సభ్యులు రాకపోవడంపై ఆ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు  తమకు సమాచారం అందిస్తే దహన సంస్కారాలు చేస్తామని  వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి : Eating Yogurt : పెరుగు తింటే కొవ్వు పెరుగుతుందా..? ఇందులో నిజమెంత..! తెలుసుకోండి..

Accident: రోడ్డు ప్ర‌మాదంలో బాబాయ్ మృతి.. విష‌యం తెలియ‌క రాత్రంతా శ‌వంపై ప‌డుకున్న చిన్నారి..