
కుక్క అంటేనే విశ్వాసానికి మారుపేరు. దానికి ఆశ్రయం ఇచ్చిన వారిపట్ల ఎంతో విధేయత చూపుతుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి యాజమానిని కాపాడిన సందర్భాలు ఎన్నో చూశాం. అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి జరిగింది. ఈ ఘటన గుండె తరుక్కుపోయేలా చేస్తోంది. ఈ శునకం.. విశ్వాసానికి మారుపేరు అని రుజువు చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ హృదయ విదారక సంఘటన జరిగింది. ఆ కుక్క తన యజమాని మృతదేహాన్ని నాలుగు రోజులకు పైగా ఎముకలు కొరికే చలిలో కాపలాగా ఉంది.
హిమాచల్ ప్రదేశ్లో భయంకరమైన మంచును సైతం లెక్కచేయకుండా యాజమాని చూపిన ప్రేమకు విధేయత చూపింది. మంచులో కూరుకుపోయి యాజమాని చనిపోతే అతని మృతదేహానికి నాలుగు రోజులు కాపలా కాసింది ఈ శునకం. ఈ హృదయ విదారకమైన ఉదంతం చాలామందికి కన్నీళ్లు తెప్పించింది. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్ చంబా జిల్లా భర్మౌర్లో జరిగింది. మంచు వీడియోలు చిత్రీకరించడానికి వెళ్లిన పీయూష్.. భర్మౌర్లోని బర్మనీ ఆలయం దగ్గర కనిపించకుండా పోయారు.
చివరకు మంచులో చిక్కుకుని మరణించినట్లు అధికారులు గుర్తించారు. అతడి కోసం గాలించి, నాలుగు రోజుల తర్వాత మృతదేహాన్ని గుర్తించారు. అక్కడ కనిపించిన హృదయ విదారకమైన ఉదంతం చాలామందికి కన్నీళ్లు తెప్పించింది. తన యాజమాని పీయూష్ మంచులో కూరుకుపోవడంతో.. అతడిని మంచులో నుంచి బయటకు తీసుకురాలేని పరిస్థితిలో.. నాలుగు రోజులుగా యాజమాని డెడ్బాడీ పక్కనే ఉండి రోదించింది ఆ శునకం. తిండి, నిద్ర మానుకుని డెడ్ బాడీ పక్కనే పడిగాపులు కాసింది. యాజమాని కోసం దీనంగా చూస్తూ కన్నీరు పెట్టుకుంది. జంతువుల బారిన తన యజమాని మృతదేహం పడకుండా కాపాడింది.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..