
వాస్తు ఇంట్లో ఉండే వారిపై ప్రభావం చూపుతుందని వాస్తు పండితులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా భారతీయులు వాస్తు శాస్త్రంలో ఉండే ఈ విషయాన్ని ఎక్కువగా విశ్వసిస్తుంటారు. వాస్తు వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపైనే కాకుండా ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుందని చెబుతుంటారు వాస్తులో ఏవైనా దోషాలు ఉంటే కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి దిగజారుగుతుందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. వాస్తు దోషాల కారణంగా అప్పుల భారం పెరుగుతుందని చెబుతున్నారు. ఇంతకీ ఆ వాస్తు దోషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో వాయువ్యం, ఆగ్నేయం, ఈశాన్య దిశలో వాస్తు దోషాల వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు మొదలవుతాయని చెబుతున్నారు. వాయువ్య దిశలో లోపం వల్ల పదే పదే రుణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఆగ్నేయ దిశలో వాస్తు దోషాల కారణంగా, ఖర్చులు నిరంతరం పెరుగుతాయి, అలాగే తీసుకున్న రుణం చెల్లించడంలో విఫలమవుతారు. అలాగే ఈశాన్య దిశలో వాస్తు దోషం ఉంటే.. షేర్ మార్కెట్, జూదం, బెట్టింగ్, లాటరీ వంటి వాటిలో నష్టపోతారని చెబుతున్నారు.
* అద్దం విషయంలో వాస్తు దోషాలు కూడా అప్పుల భౄరం పెంచుతుందని చెబుతున్నారు. ఉత్తరం లేదా తూర్పు దిశలో ఎప్పుడూ అద్దం పెట్టకూడదని చెబుతున్నారు. ఈ దిశలో అద్దం ఉంటే వెంటనే తీసేయాలని సూచిస్తున్నారు.
* ఇక ఇంటికి నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లో బాత్రూమ్ ఉండకూడదు. ఈ దిశలో నిర్మించిన బాత్రూమ్ మిమ్మల్ని అప్పుల్లో ముంచెత్తుతుంది. ఈ దిశలో ఇప్పటికే బాత్రూమ్ నిర్మించబడి ఉంటే, వాస్తు దోషాలను తొలగించడానికి, ఉప్పుతో నిండిన గిన్నెను ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఉప్పును ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి.
* కుళాయి నుంచి నీరు కారుతున్నా అప్పుల బాధలు వేధిస్తాయని వాస్తు పండితులు చెబుతున్నారు. ఒకవేళ కుళాయి నుంచి వృథాగా పోతుంటే వెంటనే మరమ్మత్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక నష్టాలు వస్తాయి. అప్పుల బాధ వేధిస్తుంది.
* రుణం నుంచి త్వరగా విముక్తి లభించాలంటే వాస్తు శాస్త్రం ప్రకారం.. మీరు అప్పు తీసుకున్నప్పుడు, దాని మొదటి వాయిదాను మంగళవారం తిరిగి చెల్లిస్తే అప్పుల భారం త్వరగా తగ్గుతుందని చెబుతున్నారు.
* ఇంట్లో ఉండే పెద్దలు ఎట్టి పరిస్థితుల్లో వాయువ్య దిశలో నివాసం ఉండకూదు. ఇంటి పెద్ద నివసించే గది వాయువ్య దిశలో ఉంటే.. ఉద్యోగం, వ్యాపారంలో నష్టాలు వస్తాయి. అప్పుల భారం పెరుగుతుంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..