
సంకటహర చతుర్థి అంటే మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది. ప్రతినెలా వచ్చే వినాయకుని పండుగ. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చతుర్థి. ఆ రోజున భక్తులు ఎంతో ప్రత్యేకంగా చేసేది సంకటహర చతుర్థి వ్రతం. ఈ రోజున వినాయకుడిని పూజించి, చంద్రుడిని చూసిన తర్వాతే ఉపవాసం ముగుస్తుంటారు భక్తులు. గణపతి పూజ అనంతరం పనులు ప్రారంభిస్తే విజయం దక్కుతుందని అందరి నమ్మకం. అలాంటిది ఆ వినాయకుడికి ఇష్టమైన రాశి ఒకటుంది. ఈ రాశిలో పుట్టినవారికి అన్నింటిలోనూ విజయం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
వినాయకుడికి మేష రాశి అంటే చాలా ఇష్టం అని వేద జ్యోతిశాస్త్ర పండితులు చెబుతున్నారు.. మేష రాశిని కుజుడు పాలించడం వల్ల వీరు చాలా సాహసోపేతంగా, ధైర్యవంతులుగా, పనుల్లో నైపుణ్యం కలిగి ఉంటారని అంటున్నారు.. వినాయకుడి ఆశీస్సులతో ఈ రాశిలో జన్మించిన వారు చాలా తెలివైనవారు అవుతారట.. వీరు తలపెట్టిన ప్రతి పనిలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారని పండితులు చెబుతుంటారు. బుధుడు మిథున రాశిని పాలించే గ్రహం కాబట్టి, వినాయకుడు వీరికి ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. వీరి కష్టపడి పనిచేసే తత్త్వం అంటున్నారు. వీరికి ఆ వినాయకుని ఆశీస్సులు ఉంటాయని చెబుతున్నారు..
ఇక విధి మద్దతు కారణంగా, మిథున రాశి వారు వారి జీవితంలోని ప్రతి అంశంలో విజయాన్ని సాధిస్తారని అంటున్నారు. మకరరాశి వారికి కూడా ఆ గణనాధుడి ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పూడు ఉంటాయని చెబుతున్నారు. ఈ రాశిలో జన్మించిన వారు వినాయకుని ఆశీస్సుల వల్ల వారి జీవితంలో గౌరవం, విజయాలను పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారు ఉన్నత విద్య ద్వారా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని జ్యోతిశాస్త్ర పండితులు చెబుతుంటారు.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..