
బహిరంగ మలవిసర్జన, పబ్లిక్ టాయిలెట్లు వినియోగించడం వల్ల ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయని చాలా మందికి తెలియదు. దీని గురించి పెద్దగా అవగాహన కూడా చాలా మందికి ఉండదు. కానీ పరిశుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ఈ విషయంలో కృషి చేస్తున్నాయి. 2014 తర్వాత, మరుగుదొడ్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడంలో మనదేశం సాధించిన విజయం సాధించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ ద్వారా మరుగుదొడ్ల భద్రతపై అవగాహన కల్పించడమే కాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోంది.బహిరంగ మలవిసర్జన అనేది లక్షలాది ప్రజల జీవితాలను ప్రభావితం చేసే, అనేక వ్యాధులకు కారణమయ్యే తీవ్రమైన సమస్య. దీని వల్ల మహిళలు శారీరకంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే బహిరంగ మలమూత్ర విసర్జన వల్ల ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఈ విషయంపై అవగాహన పెంచుకుని మరుగుదొడ్లను ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి.