AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Control Tips: షుగర్ బాధితులకు దివ్యౌషధం.. బ్లడ్ షుగర్ స్పైక్ అయ్యే ప్రమాదం ఉండదంటే నమ్మండి..

ఆయుర్వేదం ప్రకారం, తక్కువ శారీరక శ్రమ, ఎక్కువ మానసిక శ్రమ చేసే వ్యక్తులు ఈ వ్యాధికి గురవుతారు. మధుమేహాన్ని నియంత్రించడంలో ఆయుర్వేద నివారణలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది. ఆయుర్వేద వైద్యులు ప్రకారం, ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే, కొన్ని ఆయుర్వేద మూలికలను తీసుకుంటే, శారీరక శ్రమను పెంచినట్లయితే, మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం రక్తంలో చక్కెరను ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.

Diabetes Control Tips: షుగర్ బాధితులకు దివ్యౌషధం.. బ్లడ్ షుగర్ స్పైక్ అయ్యే ప్రమాదం ఉండదంటే నమ్మండి..
Diabetes
Sanjay Kasula
|

Updated on: Nov 02, 2023 | 2:29 PM

Share

డయాబెటిస్‌లో, ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది లేదా ఆపివేస్తుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లు, ఉపవాసం నుండి తిన్న తర్వాత వరకు చక్కెరను నియంత్రించడం చాలా ముఖ్యం. ఉపవాసం, భోజనం తర్వాత చక్కెర ప్రతిరోజూ ఎక్కువగా ఉంటే, దాని ప్రభావం శరీరంలోని ఇతర భాగాలపై కూడా కనిపిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లలో బ్లడ్ షుగర్ అదుపులో ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతోపాటు ఒత్తిడికి దూరంగా ఉండాలి.

ఆయుర్వేద వైద్యులు అందించిన సమాచారం ప్రకారం, మధుమేహంలో శారీరక శ్రమ చాలా ముఖ్యమైనది . ఆయుర్వేదం ప్రకారం, తక్కువ శారీరక శ్రమ, ఎక్కువ మానసిక శ్రమ చేసే వ్యక్తులు ఈ వ్యాధికి గురవుతారు. మధుమేహాన్ని నియంత్రించడంలో ఆయుర్వేద నివారణలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు చేస్తుంది. ఆయుర్వేద వైద్యులు ప్రకారం, ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటే, కొన్ని ఆయుర్వేద మూలికలను తీసుకుంటే, శారీరక శ్రమను పెంచినట్లయితే, మధుమేహాన్ని సులభంగా నియంత్రించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం రక్తంలో చక్కెరను ఎలా నియంత్రించాలో తెలుసుకుందాం.

యోగా చేస్తే షుగర్ ఎప్పుడూ అదుపులోనే..

డయాబెటిక్ పేషెంట్ రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే.. వారు రోజుకు 20-25 నిమిషాలు యోగా చేయాలి. యోగా చేయడం ద్వారా బ్లడ్ షుగర్ లెవెల్ ను సులభంగా కంట్రోల్ చేసుకోవచ్చు. యోగాసనాలు ఆచరించే అలవాటు అనేక వ్యాధుల ప్రమాదాన్ని తొలగిస్తుంది.

మెంతి గింజలను తినండి

మధుమేహం అదుపులో ఉండాలంటే మెంతి గింజలను తినండి. మెంతి గింజల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. మీరు మెంతి గింజలను నీటిలో నానబెట్టి తినవచ్చు. కావాలంటే మెంతి గింజలను మొలకలుగా కూడా ఉపయోగించవచ్చు. మెంతి గింజలు రుచిలో చేదుగా ఉంటాయి కానీ ఈ చేదు మెంతులు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఔషధంలా పనిచేస్తాయి.

దాల్చిన చెక్క తినండి

రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్నవారు రోజూ దాల్చిన చెక్కను తీసుకోవాలి. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది. ఒక చెంచా దాల్చిన చెక్క, ఒక చెంచా మెంతిపొడి, కొద్దిగా పసుపు కలపండి. ఈ పొడిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే, రోజంతా బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.

సోరకాయ, దోసకాయ, టొమాటో రసం త్రాగాలి

మీడియం సైజులో ఒక సోరకాయ, మీడియం సైజ్ దోసకాయ , మీడియం సైజు టొమాటో తీసుకోండి. ఈ మూడు కూరగాయలను జ్యూస్‌గా చేసుకుని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే ఫాస్టింగ్ షుగర్, మీల్ తర్వాత షుగర్ అదుపులో ఉంటాయి. ఈ మూడు కూరగాయలు చక్కెరను నియంత్రిస్తాయి, శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతాయి. శరీరంలోని పోషకాల లోపాన్ని తీరుస్తాయి. ఈ రసం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొట్టను కూడా శుభ్రంగా ఉంచుతుంది.

గిలాయ్ తినండి..

గిలోయ్(తిప్పతీగ, తిప్ప సత్తు) తీసుకోవడం మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని రుజువు చేస్తుంది. గిలోయ్‌ని తినడానికి, గిలోయ్‌ని తీసుకొని దానిని చూర్ణం చేయండి. ఇప్పుడు ఒక గ్లాసు నీటిని తీసుకుని అందులో గిలోయ్‌ని రాత్రంతా నానబెట్టండి. ఉదయం ఈ నీటిని మరిగించి, సగం నీరు మిగిలిపోయాక, గ్యాస్ ఆఫ్ చేయండి. గిలోయ్ టీ తీసుకోవడం వల్ల రోజంతా చక్కెర నియంత్రణలో ఉంటుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ తెలుసుకుందాం

Follow Us