Coronavirus: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందే విధానంలో మార్పు వచ్చింది. ఇంతవరకూ కరోనా వైరస్ సోకిన వ్యక్తి తుమ్ముతోనో.. దగ్గుతోనో వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పేవారు. ఇప్పుడు తాజాగా గాలిలో కూడా కరోనా వ్యాప్తి చెందుతున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన తాజా క్లినికల్ క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ను విడుదల చేసింది. తుమ్ములు లేదా దగ్గు ద్వారా వచ్చే తుంపర్లతో పాటు వైరస్ గాలిలో కూడా వ్యాపిస్తోందని బుధవారం వెల్లడించిన ప్రోటోకాల్ లో ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత జూన్ నెలలో ప్రచురించిన క్లినికల్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ లో కేవలం వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినా.. దగ్గినా ఆ తుంపర్లతోనే కోవిడ్ వ్యాప్తి జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు గాలి ద్వారా కూదా వ్యాపిస్తుందని చెబుతున్నారు. కరోనా వైరస్ సోకిన ఏరోసోల్లను 10 మీటర్ల వరకు గాలిలో తీసుకెళ్లవచ్చని ప్రభుత్వానికి ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకంలో పేర్కొంది.
“వైరస్ ప్రధానంగా ఒకరితో ఒకరు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల మధ్య వ్యాప్తి చెందుతుందని ప్రస్తుత సాక్ష్యాలు సూచిస్తున్నాయి, సాధారణంగా 1 మీటర్ (స్వల్ప-శ్రేణి) లోపు. వైరస్ కలిగిన ఏరోసోల్స్ లేదా బిందువులు పీల్చినప్పుడు లేదా నేరుగా సంబంధంలోకి వచ్చినప్పుడు ఒక వ్యక్తికి సోకుతుంది. వైరస్ పేలవంగా వెంటిలేషన్ చేయబడిన లేదా రద్దీగా ఉండే ఇండోర్ సెట్టింగులలో కూడా వ్యాప్తి చెందుతుంది, ఇక్కడ ప్రజలు శారీరక సామీప్యతలో ఎక్కువ సమయం గడపడమే దీనికి కారణం. ఏరోసోల్స్ గాలిలో ఉండడం లేదా ఎక్కువ దూరం ప్రయాణించడం 1 మీటర్ (లాంగ్-రేంజ్) జరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఇటీవల కనుగొంది.
తాజా ప్రోటోకాల్లో పొందుపరిచిన కొన్ని ఇతర మార్పులు ఇలా..
Also Read: Covid-19 vaccine: ఆ రాష్ట్రాల్లోనే కోవిడ్ వ్యాక్సిన్ల వృథా అధికం.. అరికట్టాలని సూచించిన కేంద్రం
Corona: కొత్త లక్షణాలతో వ్యాపిస్తున్న కరోనా.. సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!