పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘కాటమరాయుడు’ సినిమాలో చివరిసారిగా కనిపించిన శృతి హాసన్.. దాదాపు రెండేళ్ల గ్యాప్ తీసుకుని మళ్ళీ వెండి తెరపైకి రీ-ఎంట్రీ ఇవ్వనుంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఎస్.పీ జననాధాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘లాభం’ సినిమాలో హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో నిన్న గ్రాండ్ గా లాంచ్ అయింది.
ఈ విషయం గురించి శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ.. ‘‘నాకెంతో ఇష్టమైన నటీనటులతో నా కొత్త సినిమా ప్రారంభించాను. చాలా పాజిటివ్గా.. సరదాగా అనిపిస్తోంది’’ అని పేర్కొంది.
— shruti haasan (@shrutihaasan) April 23, 2019