Drushyam-2: తెలుగులో ‘దృశ్యం’ చూపిస్తారా..? వెంకీ మళ్లీ రాంబాబుగా కనిపిస్తాడా.? మర్డర్ మిస్టరీ తెలిసిపోతుందా..?

|

Feb 09, 2021 | 7:14 PM

Venkatesh Will act In Drushyam-2: మలయాళంలో వచ్చిన 'దృశ్యం' సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషంగా సాగుతోన్న ఓ మధ్య తరగతి కుటుంబంలో..

Drushyam-2: తెలుగులో దృశ్యం చూపిస్తారా..? వెంకీ మళ్లీ రాంబాబుగా కనిపిస్తాడా.? మర్డర్ మిస్టరీ తెలిసిపోతుందా..?
Follow us on

Venkatesh Will act In Drushyam-2: మలయాళంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా ఏ స్థాయిలో విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంతోషంగా సాగుతోన్న ఓ మధ్య తరగతి కుటుంబంలో అనుకోకుండా చోటుచేసుకున్న సంఘటన వారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్లు కురిపించింది.
ఇక తెలుగులోనూ రీమేక్‌ అయిన ఈ సినిమా ఇక్కడ కూడా మంచి మార్కులు కొట్టేసింది. ఇందులో రాంబాబు పాత్రలో విక్టరీ వెంకటేష్‌ అద్భుత నటనను కనబరిచాడు. హిందీలోనూ విడుదలైన ఈ సినిమా అక్కడా హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే తాజాగా మలయాళంలో ‘దృశ్యం-2’ విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే చిత్ర యూనిట్‌ ఈ సినిమాను ఈనెల 19న విడుదల చేస్తున్నట్లు ప్రకటిస్తూ.. చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దృశ్యంలో మిస్టరీగా మిగిలిపోయిన మర్డర్‌ కేసు మళ్లీ తెరపైకి వస్తే ఏం జరిగిందన్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉంటే తెలుగులోనూ ఈ సినిమా సీక్వెల్‌ తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా వెంకీ మరోసారి రాంబాబు పాత్రలో ఆకట్టుకోనున్నాడని సమాచారం. మరికొన్ని రోజుల్లోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని చర్చ జరుగుతోంది. ఇక వెంకీ ప్రస్తుతం.. ‘ఎఫ్‌3’ సినిమాతో పాటు తరుణ్‌ భాస్కర్‌ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.

Also Read: Rashmika Mandanna : అభిమాన హీరో సరసన ఆఫర్ అందుకున్న టాలీవుడ్ లక్కీ బ్యూటీ.. ఇంతకు అతడెవరంటే..