విభిన్న కథలను ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పటికే ఎన్ని సినిమాలు అలా వచ్చి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక సినిమాలో విషయం ఉంటే ఆ సినిమాకు టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. తాజాగా అలాంటి కథలతో సినిమాలు చాలా వచ్చాయి.. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ చిత్రానికి తరుణ్ భాస్కర్, నందినీ రెడ్డి, నాగ్ అశ్విన్, సంకల్ప్రెడ్డి సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ఈషా రెబ్బా, లక్ష్మీ మంచు, శృతిహాసన్, అమలాపాల్, జగపతిబాబు, అషిమా నర్వాల్, సత్యదేవ్, సాన్వే మేఘనా, సంజిగత్ హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. బోల్డ్ కథాంశంతో సాగుతున్న ట్రైలర్ లో రొమాంటిక్, సీరియస్ సన్నివేశాలను చూపించారు. ఆర్ఎస్వీపీ, ఫ్లైయింగ్ యూనికార్న్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మిస్తున్న పిట్టకథలు నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 19న విడుదలకానుంది.