Megastar Chiranjeevi: ఆసుపత్రిలో ఆయనను చూడగానే చిరంజీవి ఏడ్చేసారు.. చాలా ఎమోషనల్ అయ్యారు..

|

May 24, 2023 | 4:40 PM

శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో నేను, చిరంజీవి కలిసి వెళ్లాము. మమ్మల్ని చూడగానే హాయ్ అన్నట్లుగా చేయి చూపించారు.. కానీ మాట్లాడలేదు. ఆయనను అలా ఆసుపత్రి బెడ్ పై చూడగానే చిరంజీవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

Megastar Chiranjeevi: ఆసుపత్రిలో ఆయనను చూడగానే చిరంజీవి ఏడ్చేసారు.. చాలా ఎమోషనల్ అయ్యారు..
Megastar Chiranjeevi
Follow us on

ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొద్ది నెలలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మే 22న గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు సీనియర్ నటులు సంతాపం వ్యక్తం చేసారు. అయితే ఆయన చనిపోవడానికి ముందు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో చిరంజీవి.. అలనాటి హీరోయిన్ సుహాసిని ఆయనను పరామర్శించేందుకు వెళ్లినట్లు సుహాసిని తెలిపారు.

“శరత్ బాబు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో నేను, చిరంజీవి కలిసి వెళ్లాము. మమ్మల్ని చూడగానే హాయ్ అన్నట్లుగా చేయి చూపించారు.. కానీ మాట్లాడలేదు. ఆయనను అలా ఆసుపత్రి బెడ్ పై చూడగానే చిరంజీవి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆయనను అలా చూసి చిరంజీవి చాలా ఎమోషనల్ అయ్యారు. మేమిద్దరం శరత్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించాము. ఆయనతో ఎక్కువ సేపు ఆసుపత్రిలో గడిపాము” అని అన్నారు సుహాసిని.

ఇవి కూడా చదవండి

తన మొదటి చిత్రం శరత్ బాబుతోనే అని.. రజినీకాంత్, కమల్ హాసన్ లతో ఆయనకు మంచి స్నేహం ఉందని అన్నారు. కమల్, రజినీ కాల్స్ చేసి శరత్ ఎలా ఉన్నాడనే విషయం తెలుసుకునేవారని అన్నారు సుహాసిని. తమ సమకాలీన నటుడు ఆసుపత్రిలో ఉన్నప్పుడు పరామర్శించాల్సిన బాధ్యత మాకు ఉందని అన్నారు సుహాసిని.