సెకండ్ సినిమాపై శ్రీహ‌రి త‌న‌యుడు ఫోక‌స్…

|

Jul 10, 2020 | 8:20 PM

ఏ పాత్ర వేసినా త‌న మార్క్ చూపించేవారు రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి. ఆయ‌న‌ తెలుగు ప్రేక్షకులకు మ‌న‌సుల్లో ప‌ర్మెంట్ ప్లేసు సంపాదించుకున్నారు. చిన్న వ‌య‌సులోనే కాలం చేసినా..సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే.

సెకండ్ సినిమాపై శ్రీహ‌రి త‌న‌యుడు ఫోక‌స్...
Follow us on

ఏ పాత్ర వేసినా త‌న మార్క్ చూపించేవారు రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి. ఆయ‌న‌ తెలుగు ప్రేక్షకులకు మ‌న‌సుల్లో ప‌ర్మెంట్ ప్లేసు సంపాదించుకున్నారు. చిన్న వ‌య‌సులోనే కాలం చేసినా..సినిమాల్లో చేసిన పాత్రల ద్వారా ఆయ‌న ఎప్ప‌టికీ చిరంజీవే. కాగా దివంగత‌ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌ ‘రాజ్‌దూత్‌’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. తొలిచిత్రం ఆశించిన మేర ఫ‌లితాన్ని ఇవ్వ‌లేక‌పోయింది.

అందుకే ఈసారి రియ‌ల్ స్టార్ అభిమానుల‌ను అల‌రించేందుకు, ఓ కమర్షియల్ కథాంశంతో ఆడియెన్స్ ముందుకు రావాలని నిర్ణయించుకున్నాడు మేఘాంశ్. అందుకే రెండ‌వ సినిమాపై ప‌క్కా ఫోక‌స్ పెట్టాడు. ఆ ఇటీవలే మేఘాంశ్ ఓ కథను ఫైనలైజ్‌ చేశారని తెలిసింది.మేఘాంశ్‌ త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు అఫిషియ‌ల్ గా తెలియజేస్తారు.