Arjuna Phalguna: మరో ఇంట్రస్టింగ్ కథతో రానున్న శ్రీవిష్ణు.. ఆకట్టుకుంటున్న అర్జున ఫల్గుణ పాట..

|

Nov 18, 2021 | 8:01 AM

కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్.

Arjuna Phalguna: మరో ఇంట్రస్టింగ్ కథతో రానున్న శ్రీవిష్ణు.. ఆకట్టుకుంటున్న అర్జున ఫల్గుణ పాట..
Sri Vishnu
Follow us on

Arjuna Phalguna: కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి అర్జున ఫల్గుణ అనే చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. శ్రీవిష్ణు ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. అర్జున ఫల్గుణ నుంచి ఇప్పటికే విడుదల చేసిన ఓ పాట అందరినీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో నేడు కాపాడేవా రాపాడేవా? అంటూ సాగే మరో పాటను విడుదల చేశారు. ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని అంటున్నారు చిత్రయూనిట్. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ ఈ పాటకు అద్భుతమైన బాణీని ఇచ్చారు. ఈ పాటలో శ్రీ విష్ణు అతని స్నేహితులు, అమృతా అయ్యర్ అందరూ కనిపిస్తున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. మోహన భోగరాజు గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.

టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన రాగా.. ఈ రెండో పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాట పై మీరూ ఓ లుక్కెయండి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Rashi Khanna: సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ జోరు మీదున్న అందాల రాశీ.. మరో భారీ చిత్రంలో నటించే ఛాన్స్‌..

Venkatesh Daggubati: వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సీనియర్ హీరో.. వెంకీ మామ నెక్స్ట్ మూవీ ఆ దర్శకుడితోనేనా..

Nandamuri Balakrishna: ఆ స్టార్ దర్శకుడితో బాలయ్య మల్టీస్టారర్ సినిమా చేయనున్నారా..?