సైమా 2019 అవార్డుల వేడుక..సందడి చేసిన ప్రముఖులు

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అవార్డుల కార్యక్రమం సైమా మొదటి రోజు ఫుల్‌ జోష్‌తో సాగింది. దుబాబ్‌ – సైమా 2019 అవార్డులలో రంగస్థలం మూవీకి ఏకంగా తొమ్మిది అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, క్రిటిక్స్‌ ఉత్తమ హీరోయిన్‌గా సమంత, ఉత్తమ సినిమాటోగ్రఫీగీ రత్నవేలు, ఉత్తమ ఆర్ట్‌గా రామకృష్ణ, ఉత్తమ సంగీత దర్శకుడిగా డీఎస్పీ, ఉత్తమ సహాయ నటిగా అనసూయ, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్‌, ఉత్తమ గాయని […]

సైమా 2019 అవార్డుల వేడుక..సందడి చేసిన ప్రముఖులు

Edited By:

Updated on: Aug 16, 2019 | 3:45 PM

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే అవార్డుల కార్యక్రమం సైమా మొదటి రోజు ఫుల్‌ జోష్‌తో సాగింది. దుబాబ్‌ – సైమా 2019 అవార్డులలో రంగస్థలం మూవీకి ఏకంగా తొమ్మిది అవార్డులు దక్కాయి. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌, ఉత్తమ నటుడిగా రామ్‌చరణ్, క్రిటిక్స్‌ ఉత్తమ హీరోయిన్‌గా సమంత, ఉత్తమ సినిమాటోగ్రఫీగీ రత్నవేలు, ఉత్తమ ఆర్ట్‌గా రామకృష్ణ, ఉత్తమ సంగీత దర్శకుడిగా డీఎస్పీ, ఉత్తమ సహాయ నటిగా అనసూయ, ఉత్తమ గీత రచయితగా చంద్రబోస్‌, ఉత్తమ గాయని మానసి అవార్డులు అందుకున్నారు. రామ్‌ చరణ్‌ తరుపున చిరంజీవి అవార్డులను అందుకున్నారు. కాగా ఉత్తమ చిత్రంగా మహానటి నిలిచింది. గీతా గోవిందం నటనకు గానూ విజయ్‌ దేవరకొండకు రెండు అవార్డులు లభించాయి. ఆర్‌ఎక్స్‌ 100మూవీకి మూడు అవార్డులు లభించాయి. అలాగే మహానటిలో నటనకు గానూ రాజేంద్ర ప్రసాద్‌కు ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు అందుకున్నారు. ఇక 16వ తేదీన తమిళ, మలయాళ చిత్రాలకు సంబంధించిన అవార్డుల వేడుకకు మాలీవుడ్‌ మెగాస్టార్‌ మోహన్‌లాల్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.