YS Jagan Biopic: సీఎం వైఎస్ జగన్ బయోపిక్‌కు రంగం సిద్దం.. హీరోగా ఎవరో తెలుసా.?

|

Jul 02, 2021 | 12:05 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దమైనట్లు..

YS Jagan Biopic: సీఎం వైఎస్ జగన్ బయోపిక్‌కు రంగం సిద్దం.. హీరోగా ఎవరో తెలుసా.?
Cm Jagan
Follow us on

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయోపిక్‌ను తెరకెక్కించేందుకు రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ సెన్సేషనల్ అప్‌డేట్ ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రస్తానాన్ని ‘యాత్ర’ మూవీగా చిత్రీకరించి ప్రశంసలు అందుకున్న దర్శకుడు మహి.వి. రాఘవ్ ఈ మూవీని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఇందులో భాగంగానే నటీనటుల ఎంపిక దాదాపుగా ఫైనల్ అయినట్లు సమాచారం. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నాడని టాక్.

తెలుగు రాష్ట్రాల్లో మాస్ లీడర్‌గా వైఎస్ జగన్ ఎదిగిన తీరు, పార్టీని నెలకొల్పిన 10 ఏళ్లలోనే అధికారంలోకి తీసుకొచ్చిన ఆయన ప్రయాణం, సీఎంగా ఆయన ప్రస్థానం వంటి అంశాల ఆధారంగా బయోపిక్‌ను రూపొందించేందుకు కథను సిద్దం చేస్తున్నారట. ఇక ఈ మూవీలో జగన్ పాత్రలో ‘స్కామ్ 1992’ ఫేం ప్రతీక్ గాంధీ నటించాబోతున్నారని టాక్. ఈ సినిమాకు ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ప్రీతిక్ గాంధీ ‘స్కామ్ 1992’ వెబ్ సిరీస్ ద్వారా భాషాబేధం లేకుండా ఎందరో అభిమానులను సంపాదించాడు. 2020 లాక్‌డౌన్‌ సమయంలో ఈ వెబ్ సిరీస్ అగ్రస్థానంలో నిలిచింది. ఎలాంటి బూతు డైలాగులు, శృంగారభరిత సన్నివేశాలు లేకుండా తెరకెక్కించిన ‘స్కామ్ 1992’ ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచింది.

Also Read: 

హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని ఎంఎంటీఎస్ రైళ్లు..

సింగిల్‌గా ఉందని ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే!

టీమిండియాపై ట్రిపుల్ సెంచరీ.. 48 బంతుల్లో శతకం.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆ ఓపెనర్ ఎవరంటే.!

రెస్టారెంట్‌ను పేల్చేస్తానంటూ కస్టమర్ ఫోన్.. కారణం ఆరా తీయగా మైండ్ బ్లాంక్.!