
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల సైలెంట్ గా ఉన్న ఆమె ఇప్పుడు సడన్ గా వార్తల్లో నిలిచింది. 14 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్తో వివాహబంధంలోకి అడుగుపెట్టింది తర్వాత విడాకులు తీసుకున్న ఈ టెన్నిస్ క్వీన్, ప్రస్తుతం బిడ్డతో కలిసి జీవిస్తుంది. అయితే సానియా మీర్జా త్వరలోనే మరో వివాహం చేసుకోబోతుందని ఈ మధ్య తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే మొన్నామధ్య సానియా మీర్జా ఓ టాలీవుడ్ హీరోతో పెమలో పడిందని. త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ హీరో పేరు బయటకు రాలేదు కానీ వార్తలు మాత్రం తెగ వైరల్ అయ్యాయి.
షోయబ్ మాలిక్ మరొక మహిళతో ప్రేమలో ఉన్నారని తెలుసుకున్న సానియా, విడాకులు తీసుకుని ఒంటరిగా జీవించడాన్ని ఎంపిక చేసుకుంది. ఆమె కుమారుడు ఇజాన్తో సహా తన వ్యక్తిగత జీవితంలో కొత్త విషయాన్ని వెతుక్కుంటోంది. షోయబ్ మాలిక్ తన రెండో పెళ్లితో ముందుకు సాగాడు. అతను ప్రముఖ పాకిస్థానీ నటి సనా జావేద్ను వివాహం చేసుకున్నాడు, ఇది ఆమెకు కూడా రెండో పెళ్లే. సనా జావేద్, షోయబ్ తమ వివాహ బంధంతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టగా, సానియా కొడుతో జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే త్వరలోనే సానియా మీర్జా బయోపిక్ రానుంది. ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సానియా మీర్జా కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన బయోపిక్ లో దీపికా పదుకొనె కానీ పరిణితి చోప్రా కానీ నటిస్తే సూట్ అవుతుందని సూచించింది సానియా మీర్జా.
అలాగే తన బయోపిక్ లో అక్షయ్ కుమార్ ను ఉహించుకుంటున్నట్టు తెలిపింది. తాను అక్షయ్ కుమారు కు పెద్ద ఫ్యాన్ అని.. అన్ని కుదిరి ఆయన తన బయోపిక్ లో నటిస్తే అక్షయ్ తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పుకొచ్చింది సానియా మీర్జా. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సానియా చేసిన కామెంట్స్ పై అక్షయ్ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి