
చాలా మంది హీరోయిన్స్ ను ప్రేక్షకులు మర్చిపోయారు కూడా.. అయితే సినిమాలకు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్ ను నిరాశపరిచిన భామల్లో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది. వరుస సినిమాలతో ఇండస్ట్రీని అల్లాడించింది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అయ్యింది. పెళ్లి చేసుకొని ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అంతే కాదు అప్పుడు క్రేజీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు షాకింగ్ లుక్ లోకి మారిపోయింది. ఇక ఈ ముద్దుగుమ్మ జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గింది. ఇంతకూ ఆమె ఎవరంటే..
హీరోయిన్స్ చాలా మంది ఫిట్ నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. సినిమాలకు తగ్గట్టుగా శరీర ఆకృతిని మార్చుకుంటూ ఉంటారు. పాత్రలు డిమాండ్ చేస్తే దానికి తగ్గట్టుగా మారిపోతూ ఉంటారు. ఇక ఫిట్ నెస్ కోసం జిమ్లో తెగ కష్టపడుతూ ఉంటారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం జిమ్ కు వెళ్లకుండా బరువు తగ్గి అందరికి షాక్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరంటే.. ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో సమీరా రెడ్డి ఒకరు.
టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ లో సూర్య తోనూ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ఆమె ఎవరో కాదు అందాల భామ సమీరారెడ్డి. 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సమీరా రెడ్డి. ఆతర్వాత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది లుక్ మారిపోయింది.. బరువు పెరిగిపోయింది. హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల చాలా బరువు పెరిగాను అని తెలిపింది సమీరా రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ.. అప్పట్లో తన బరువు 105కేజీలకు పైగా ఉండేదని దాని వల్ల చాలా ట్రోల్స్ బారిన పడ్డాను అని తెలిపింది సమీరా. అలాగే జనాలు మంచి వాళ్లు కాదు..ఏదైనా సరే చెప్పాలనుకుంటే మొహం మీదే చెప్పేస్తారు. నా పక్క వారు కూడా నన్ను ట్రోల్ చేశారు. కానీ అవి నన్ను అంతగా బాధపెట్టలేదు. ఆ సమయంలో నేను ఎంత బాధ అనుభవిస్తున్నానో ఎవరికీ తెలియదు అందుకే నేను ఈ విషయంలో అబద్దం చెప్పాలనుకోవడం లేదు అని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.. అలాగే ఆ మధ్య జిమ్ కు వెళ్లకుండా ఇంట్లో పనులతోనే బరువు తగ్గాను అని తెలిపింది ఈ ముద్దుగుమ్మ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.