AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhola Shankar: భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ సిస్టర్‌గా ముందుగా ఆ హీరోయిన్ అనుకున్నారట..!!

మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తిసురేష్ చిరంజీవి చెల్లిగా నటించింది. అన్న చెల్లెలి మధ్య ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్ గా ఉంటాయి. అయితే ఈ మూవీ తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలమ్ మూవీకి రీమేక్ గా వచ్చింది. మెహర్ రమేష్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. భోళాశంకర్ మెగా ఫ్యాన్స్ ను కూడా దారుణంగా నిరాశపరిచింది.

Bhola Shankar: భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ సిస్టర్‌గా ముందుగా ఆ హీరోయిన్ అనుకున్నారట..!!
Bholashankar
Rajeev Rayala
|

Updated on: Aug 15, 2023 | 10:57 AM

Share

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ భోళాశంకర్. భారీ అంచనాలమధ్య ఈ సినిమా ఆగస్టు 11న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. కానీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే కీర్తిసురేష్ చిరంజీవి చెల్లిగా నటించింది. అన్న చెల్లెలి మధ్య ఎమోషన్స్ ఈ సినిమాలో హైలైట్ గా ఉంటాయి. అయితే ఈ మూవీ తమిళ్ సూపర్ హిట్ మూవీ వేదలమ్ మూవీకి రీమేక్ గా వచ్చింది. మెహర్ రమేష్ ఈ సినిమాను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేశారు. కానీ అది బెడిసి కొట్టింది. భోళాశంకర్ మెగా ఫ్యాన్స్ ను కూడా దారుణంగా నిరాశపరిచింది. సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో కలెక్షన్స్ కూడా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తిసురేష్ పాత్రకోసం ముందుగా ఏ హీరోయిన్ ను అనుకున్నారో తెలుసా.?

భోళాశంకర్ సినిమాలో చిరంజీవి చెల్లెలిగా కీర్తిసురేష్ కంటే ముందు సాయి పల్లవిని చిరు సిస్టర్ గా అనుకున్నారు. అయితే చిరంజీవి చెల్లెలిగా నటించేందుకు సాయి పల్లవి నో చెప్పిందట. ఆయన పక్కన నటించే స్థాయి తనకు లేదు అంటూ మెగాస్టార్ పై ఉన్న గౌరవం కారణంగా సాయి పల్లవి ఆ పాత్రకు నో చెప్పిందట. దాంతో ఆమె ప్లేస్ లోకి కీర్తిసురేష్ ను తీసుకున్నారు.

ప్రస్తుతం సాయి పల్లవి సినిమాలు తగ్గించింది. చిరవిగా గార్గి అనే సినిమా చేసింది. ఆతర్వాత ఇంతవరకు ఆమె కొత్త సినిమాను అనౌన్స్ చేయలేదు. అయితే తమిళ్ లో సాయి పల్లవి ఓ సినిమా చేస్తుందని తెలుస్తోంది. మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుందని టాక్.

సాయి పల్లవి తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేసింది..

తెలుగులో ఫిదా సినిమాతో పరిచయం అయ్యింది ఈ చిన్నది

సాయి పల్లవి ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.