Sai Durgha Tej: ‘ఇప్పుడిది నాకు పునర్జన్మ’.. హైదరాబాద్ పోలీసులకు మెగా మేనల్లుడి విరాళం

సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2021 సెప్టెంబర్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ (పేరు మార్చుకున్నాడు). తీవ్ర గాయాలు కావడంతో కోమాలోకి వెళ్లిపోయాడు. చాలా రోజుల పాటు ఆస్పత్రిలోనే చికిత్స పొందిన సాయి అభిమానుల ప్రార్థనలతో తిరిగి కోలుకున్నాడు.

Sai Durgha Tej: ఇప్పుడిది నాకు పునర్జన్మ.. హైదరాబాద్ పోలీసులకు మెగా మేనల్లుడి విరాళం
Sai Durgha Tej

Updated on: Sep 18, 2025 | 10:52 PM

మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. రోడ్డు భద్రతా చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ పోలీస్‌ విభాగానికి ఆయన రూ. 5లక్షల విరాళం ఇచ్చారు. గురువారం (సెప్టెంబర్ 18) హైదరాబాద్ వేదికగా జరిగిన ‘హైదరాబాద్‌ ట్రాఫిక్‌, రోడ్‌ సేఫ్టీ సమ్మిట్‌ 2025’కు అతిథిగా హాజరైన సాయి దుర్గతేజ్ పోలీసు అధికారులకు చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మెగా హీరో తన యాక్సిడెంట్ అనుభవాలను గుర్తకు తెచ్చుకున్నాడు. ద్విచక్ర వాహనదారులు తప్పనసరిగా హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశాడు.. ‘2021 సెప్టెంబరులో రోడ్డు ప్రమాదానికి గురయ్యా. రెండు వారాల పాటు కోమాలో ఉన్నా. ఇప్పుడిది నాకు పునర్జన్మ. ఇదంతా నేను సానుభూతి కోసం చెప్పడం లేదు. ఆ రోజు హెల్మెట్‌ ధరించాను కాబట్టే ఈరోజు ఇలా మీ ముందు మాట్లాడుతున్నాను. బైక్‌ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్‌ పెట్టుకోండి. బైక్‌ డ్రైవ్‌ చేసేటప్పుడు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మా మామయ్య, ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తరచూ గుర్తు చేసేవారు’ అని చెప్పుకొచ్చాడు సాయి దుర్గ తేజ్.

యాక్సిడెంట్ తర్వాత విరూపాక్ష సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు సాయి దుర్గ తేజ్. ఈ సినిమా ఏకంగా వంద కోట్ల కు పైగా కలెక్షన్లను రాబట్టింది.  ఆ తర్వాత తన మేనమామ పవన్ కల్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమాలో  యాక్ట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌ ట్రాఫిక్‌, రోడ్‌ సేఫ్టీ సమ్మిట్‌ 2025 లో సాయి దుర్గ తేజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.