AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరిన రష్మిక.. అలా చేస్తే ఓడిపోతారంటూ..

మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తు అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా తన ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరింది.

Rashmika Mandanna: ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరిన రష్మిక.. అలా చేస్తే ఓడిపోతారంటూ..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Aug 18, 2022 | 7:26 AM

Share

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఫుల్ ఫాంలో దూసుకుపోతున్న హీరోయిన్ రష్మిక మందన్నా. ఫ్యాన్స్ ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకునే ఈ చిన్నది.. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ చిత్రపరిశ్రమలలో వరుస ఆఫర్లు అందుకుంటూ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇక పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. పాన్ ఇండియా లెవల్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ నటిస్తున్న గుడ్ బై చిత్రంలో నటిస్తుంది. అలాగే రణబీర్ సరసన యానిమల్ సినిమాలోనూ కనిపించనుంది. ఓవైపు చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేస్తున్న ఈ చిన్నది.. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తు అభిమానులతో టచ్ లో ఉంటుంది. తాజాగా తన ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరింది.

బుధవారం తన ఇన్ స్టాలో క్రేజీ ఫోటో షేర్ చేసింది నేషనల్ క్రష్. డెనిమ్ ఆన్ డెనిమ్ దుస్తులు ధరించి రాక్ స్టైల్‏లో కనిపించి అట్రాక్ట్ చేసింది. కిల్లింగ్ లుక్స్‏తో ఫ్యాన్స్ మతిపోగొడుతున్న పిక్ షేర్ చేస్తూ ఎవరు ముందుగా రెప్ప వేస్తారో వారే ఓడిపోతారు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. త్వరలోనే రష్మిక పుష్ప 2 షూటింగ్‏లో పాల్గొననుంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన మిషన్ మజ్ను సినిమాలో, విజయ్ దళపతితో కలిసి వరిసు చిత్రంలోనూ నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.