Rajendra Prasad: కూతురి మరణంతో కన్నీరుమున్నీరైన నటకిరీటి.. పరామర్శిస్తున్న ప్రముఖులు

|

Oct 05, 2024 | 9:00 AM

చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు కుమారుడు, ఓ కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్‌లో ఉంది రాజేంద్రప్రసాద్‌ కుటుంబం. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో గాయత్రి భౌతికకాయానికి కుటుంబసభ్యులు నివాళి అర్పిస్తున్నారు.

Rajendra Prasad: కూతురి మరణంతో కన్నీరుమున్నీరైన నటకిరీటి.. పరామర్శిస్తున్న ప్రముఖులు
Rajendra Prasad
Follow us on

సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో నిన్న గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. చికిత్స పొందుతూ గాయత్రి తుది శ్వాస విడిచారు. రాజేంద్రప్రసాద్‌కు కుమారుడు, ఓ కూతురు. గాయత్రి ఆకస్మిక మృతితో షాక్‌లో ఉంది రాజేంద్రప్రసాద్‌ కుటుంబం. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో గాయత్రి భౌతికకాయానికి కుటుంబసభ్యులు నివాళి అర్పిస్తున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు రాజేంద్ర ప్రసాద్‌ను పరామర్శిస్తున్నారు.

కూతురి మరణంతో కన్నీటి పర్యంతమవుతున్నారు కుటుంబ సభ్యులు. ఈ విషాద వార్త తెలియగానే రాజేంద్రప్రసాద్ నివాసానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేరుకున్నారు.  ఎమ్మెల్యే మాధవరం. రాజేంద్ర ప్రసాద్ ను పరామర్శించారు. అలాగే సీని సెలబ్రెటీలు ఒకొక్కరుగా రాజేంద్రప్రసాద్ నివాసానికి చేరుకుంటున్నారు.

ఈవయసులో రాజేంద్ర ప్రసాద్ ను ఓదార్చడం ఎవరి తరం కావడం లేదు. కూతురి మరణంతో నటకిరీటి కన్నీరు మున్నీరు అవుతున్నారు. రేపు గాయత్రి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు నిర్వహించనున్నారు. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు అంటే గాయత్రి కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహానటి సినిమాలో సావిత్రి చిన్ననాటి పాత్రను పోషించింది గాయత్రి కూతురు. రాజేంద్ర ప్రసాద్ సంప్రదాయంలో పిల్లల పుట్టిన రోజులను చేస్తారు, వైకుంఠ ఏకాదశి కి కొడుకు పుడితే బాలాజీ అని, విజయదశమి రోజు అమ్మాయి పుట్టింది కనుక గాయత్రి అని నామకరణం చేశారు. మరి కొద్ది రోజుల్లోనే 39 వ పుట్టిన రోజు జరుపుకోవాల్సిన సమయం లో ఈ దుర్ఘటన జరిగింది. ఇంత చిన్న వయసులో గాయత్రి గుండెపోటుతో మరణించడంతో రాజేంద్ర ప్రసాద్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి