Kiara Advani: కియారా దెబ్బకు వాటి సేల్స్ బాగా పెరిగాయట.. గూగుల్లో కూడా గట్టిగానే గాలించారట
ఈ అమ్మడు అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అంతే కాదు పలు యాడ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సేల్స్ పెంచుకోవడానికి చాలా బ్రాండ్లు ఆమెతో టై అప్ అయ్యాయి. కియారా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంది. అయితే కియారా ప్రమోట్ చేయకుండానే పరికరం డిమాండ్ భారీగా పెరిగిందట.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానటించిన భరత్ అనే నేను సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత వినయ విధేయ రామ అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో బిజీగా మారిపోయింది. అంతే కాదు పలు యాడ్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. సేల్స్ పెంచుకోవడానికి చాలా బ్రాండ్లు ఆమెతో టై అప్ అయ్యాయి. కియారా పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంది. అయితే కియారా ప్రమోట్ చేయకుండానే పరికరం డిమాండ్ భారీగా పెరిగిందట. అంతే కాదు దాని వాడకం కూడా భారీగా పెరిగిపోయిందట. దీనిపై కరణ్ జోహార్ యాజమాన్యంలోని ‘ధర్మ ప్రొడక్షన్స్’ నిర్మాత సోమన్ మిశ్రా మాట్లాడారు.
‘లస్ట్ స్టోరీస్’ చిత్రం 15 జూన్ 2018న విడుదలైంది. విభిన్నమైన కథలను కలిపి ఓ సినిమా తీశారు. ఈ చిత్రంలో లైంగిక నేపథ్యాలు ఉన్నాయి. ఈ సినిమాలో విక్కీ కౌశల్, కియారా అద్వానీ కలిసి నటించారు. కియారా తన భర్త లైంగికంగా సంతృప్తి చెందని మహిళగా కనిపించింది. ఈ కారణంగా, హీరోయిన్ సెక్స్ టాయ్ ను ఉపయోగిస్తుంది. ఈ సీన్ వైరల్గా మారింది. సినిమాకు ఇదే సీన్ వల్ల మంచి స్పందన వచ్చింది.అంతే కాదు కియారాకు మంచి పేరు తెచ్చిన సినిమా ఇది.
ఈ సినిమా ఎఫెక్ట్స్ గురించి సోమన్ మిశ్రా మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా విడుదలైన తర్వాత సెక్స్టాయ్ల అమ్మకాలు వేగంగా పెరిగాయి. ‘ఆ సినిమా సీన్ వైరల్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దీంతో సెక్స్ టాయ్స్ విక్రయాలు పెరిగాయి. గూగుల్లో కియారా అద్వానీ వైబ్రేటర్, కియారా అద్వానీ సెక్స్ టాయ్లు అంటూ సెర్చ్ చేస్తున్నారు’ అని సోమన్ అన్నారు.
కియారా కంటే ముందు కృతి సనన్కి ఆ పాత్ర దక్కింది. అయితే ఈ పాత్ర చేయడానికి ఆమె అంగీకరించలేదు. ఈ సినిమా స్క్రిప్టు చూసి, సినిమా కథ విన్న తర్వాత ఈ పాత్ర చేయకూడదని మా అమ్మ చెప్పింది. మా అమ్మకు వ్యతిరేకంగా సినిమా చేయాలనుకోలేదు అని కృతి సనన్ తెలిపింది. గతంలో కరణ్ జోహార్ హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ షోలో కృతి సనన్ మాట్లాడుతూ.. ఈ సినిమా చేయడం తనకు ఇష్టం లేదని తెలిపింది. ‘లస్ట్ స్టోరీస్’ సినిమాతో కియారా అద్వానీకి మంచి పేరు వచ్చింది. కొందరు ఆమెను ట్రోల్ కూడా చేశారు. దీని తర్వాత ‘కబీర్ సింగ్’, ‘గుడ్ న్యూస్’, ‘షేర్షా’ వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ చిత్రాల్లో నటిస్తుంది. కియారా సిద్ధార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే..