Mohanlal’s Drishyam 2 : ఆద్యంతం ఆసక్తికరంగా ‘దృశ్యం 2’ ట్రైలర్.. పాత మర్డర్ కేసు మరోసారి తెరపైకి…

|

Feb 06, 2021 | 8:33 PM

మలయాళం హిట్ మూవీ ‘దృశ్యం’ సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జీతూ జోసఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది.

Mohanlals Drishyam 2 : ఆద్యంతం ఆసక్తికరంగా దృశ్యం 2 ట్రైలర్.. పాత మర్డర్ కేసు మరోసారి తెరపైకి...
Follow us on

Drishyam 2 : మలయాళం హిట్ మూవీ ‘దృశ్యం’ సీక్వెల్‌గా ‘దృశ్యం 2’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. జీతూ జోసఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. కోవిడ్ కారణంగా ఆలస్యమైన ఈ చిత్ర షూటింగ్ ఇటీవల పూర్తయింది.  ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాగా  2013లో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో ‘దృశ్యం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, చైనీస్ భాషల్లో రీమేక్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.

తాజాగా దృశ్యం 2 ట్రైలర్ ను విడుదల చేసారు చిత్రయూనిట్. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. మీనా- సిద్దిక్- ఆశా శరత్- మురళి గోపీ- అన్సిబా- ఎస్తేర్- సైకుమార్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 19 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.

మరిన్ని ఇక్కడ చదవండి :

The Family man -2: మళ్లీ వాయిదా పడిన సమంత వెబ్ సిరీస్.. ‘ది ఫ్యామిలీ మ్యాన్-2’ విడుదల ఎప్పుడంటే..