‘డియర్‌ కామ్రేడ్‌’ బాలీవుడ్‌కు..ఏకంగా కరణ్‌ ఎనౌన్స్ చేశాడోచ్!

|

Jul 23, 2019 | 9:04 PM

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం త్వరలో విడదలకు సిద్దంగా ఉంది. నూతన డైరక్టర్ భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌, కోలీవుడ్‌లో తన సత్తా చాటిన విజయ్.. ఈ మూవీతో దక్షిణాదిలో పాగా వేయాలని ఉవ్వీళూరుతున్నాడు. అందుకే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కాగా తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహర్‌ కోసం ‘డియర్ కామ్రేడ్’ […]

‘డియర్‌ కామ్రేడ్‌’ బాలీవుడ్‌కు..ఏకంగా కరణ్‌ ఎనౌన్స్ చేశాడోచ్!
Follow us on

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన ‘డియర్‌ కామ్రేడ్‌’ చిత్రం త్వరలో విడదలకు సిద్దంగా ఉంది. నూతన డైరక్టర్ భరత్ కమ్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌, కోలీవుడ్‌లో తన సత్తా చాటిన విజయ్.. ఈ మూవీతో దక్షిణాదిలో పాగా వేయాలని ఉవ్వీళూరుతున్నాడు. అందుకే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

కాగా తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహర్‌ కోసం ‘డియర్ కామ్రేడ్’ స్పెషల్ షో వేశారు. సినిమాకు ఫిదా అయిన కరణ్ మూవీని బాలీవుడ్‌లో రిమేక్ చెయ్యాలని డిసైడ్ అయ్యారు. ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందాన్నలు అద్భుతంగా నటించారని, దర్శకుడిగా తొలిచిత్రమైనా.. భరత్‌ కమ్మ అత్యద్భుతంగా చిత్రీకరించారని, జస్టిన్‌ ప్రభాకరన్ సంగీతం బాగుందని కరణ్ ట్వీట్ చేశారు. ఇంతటి అందమైన చిత్రాన్ని ధర్మ ప్రొడక్షన్స్‌పై రీమేక్‌ చేయనున్నట్లు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.