“ప్రభాస్ ను నేనే పరిచయం చెయ్యాలి…కానీ ఆ కారణం వల్ల కుదరలేదు”.. అసలు విషయం చెప్పిన దర్శకేంద్రుడు..

|

Feb 15, 2021 | 2:22 AM

హీరోలను బట్టి సినిమాలు తీయాలన్నా.. హీరోలు స్టార్లయ్యేలా సినిమాను తెరకెక్కించాలన్నా.. చివరికి కొత్త వాళ్లను వెండి తెరకు పరిచయం చేయాలన్నా.. అప్పట్లో రాఘవేంద్రరావే టాప్‌

ప్రభాస్ ను నేనే పరిచయం చెయ్యాలి...కానీ ఆ కారణం వల్ల కుదరలేదు.. అసలు విషయం చెప్పిన దర్శకేంద్రుడు..
Follow us on

K. Raghavendra Rao : హీరోలను బట్టి సినిమాలు తీయాలన్నా.. హీరోలు స్టార్లయ్యేలా సినిమాను తెరకెక్కించాలన్నా.. చివరికి కొత్త వాళ్లను వెండి తెరకు పరిచయం చేయాలన్నా.. అప్పట్లో రాఘవేంద్రరావే టాప్‌. అందుకే.. వెంకటేష్, మహేష్‌, అల్లు అర్జున్‌ లాంటి వాళ్లను కూడా తెలుగు తెరకు పరిచయం చేసి.. స్టార్లు అయ్యేలా చేశాడు ఈ దర్శకేంద్రుడు. కాని రెబల్ స్టార్ ప్రభాస్‌ని మాత్రం సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయం చేయలేక పోయాడు. అయితే ప్రభాస్‌ తండ్రి రాఘవేంద్రరావుకు సన్నిహితుడు కావడంతో తన కొడుకుతో సినిమా చేయమని రాఘవేంద్ర రావుని అడిగారట. హీరో అయ్యేందుకు తగిన మెళకువలు నేర్చుకున్నాడని మీ డైరెక్షన్లో తొలి చిత్రం రావాలని కోరారట. కానీ, అది సాధ్యమవలేదు.

ఇక ఇదే విషయాన్నితాజాగా  ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. అప్పటి సంగతులను గుర్తుకు తెచ్చుకున్నారు రాఘవేంద్ర రావు. ‘ప్రభాస్‌ని నేనే తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలనుకున్నా.. అప్పటికే నేను పలు సినిమాలతో బిజీగా ఉండటంతో కుదరలేదు’ అని చెప్పారు. ఇప్పటి వరకు ఈ కాంబినేషన్‌లో సినిమా రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో చూడాలి అని చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు . ఇక దర్శకేంద్రుడికి కుదరకపోవడంతో ఈ అవకాశం జయంత్‌ సి. పరాన్జీకి దక్కింది. ఆయనే ప్రభాస్‌ని ‘ఈశ్వర్‌’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అలా సాధారణ నటుడిగా వచ్చిన ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

“తోపు యాక్టర్ అవుతానని అన్నారు..కానీ అట్టర్ ప్లాప్ అయ్యా”‌.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన జగ్గూభాయ్..