
Sai Kumar: విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లు గా నటిస్తున్న చిత్రం `జోరుగా హుషారుగా`. శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ బ్యానర్ పై నిరీశ్ తిరువీదుల నిర్మిస్తున్నారు. అను ప్రసాద్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం తొలి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన డైలాగ్ కింగ్ సాయికుమార్ `జోరుగా హుషారుగా` చిత్ర ఫస్ట్ లుక్ ఆవిష్కరించారు.
అనంతరం సాయికుమార్ మాట్లాడుతూ, టైటిల్ కు తగినట్లుగా హుషారైన టీమ్తో పని చేశాను. ఎస్.ఆర్. కళ్యాణమండపం చేశాక కొత్త దర్శకులు భిన్నంగా ఆలోచిస్తూ పాత్రలు ఇస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధం ఇందులో బాగా చూపించారు. విరాజ్ ను ఓటీటీలో చూశాక బాగా చేశాడనిపించింది. తను మార్తాండ్ కె.వెంకటేష్ మేనల్లుడు అని తెలిశాక ఆనందం కలిగింది. రోహిణి నా భార్యగా నటించారు. మధునందన్ చక్కటి పాత్ర చేశాడు. ప్రణీత్ చేసిన పాటలు విన్నాను, చాలా బాగున్నాయి. ఈ చిత్రం చూస్తే, మన పక్కింటి కథలా వుంటుంది. బంధాలు, అనుబంధాలు, ఫ్రెండ్ షిప్ తోపాటు పాటు వ్యక్తి జీవనపోరాటం వంటి అంశాలు ఇందులో వుంటాయి. మేకింగ్, విజువల్స్ బాగా కనిపిస్తాయి. నేను యాభైఏళ్ళుగా నటిస్తున్నా నేను చేసిందే రైట్ అనుకునేవాడిని. కానీ ఒక్కోసారి నాది రాంగ్ అని కూడా చెప్పే దర్శకులు ఇప్పుడు వున్నారు. అలాంటి కొత్త తరంతో న్యూ ట్రెండీ ఫిలిం ఇది` అని తెలిపారు.
ఆతర్వాత హీరోయిన్ పూజిత పొన్నాడ మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత ఈ సినిమా షూట్ జరిగింది. ఇది చాలా ఫన్ ఫిలిం. టైటిల్లోనే హుషారు వున్నట్లుగా మేమంతా అలా నటించాం. దర్శకుడు కథ బాగా రాసుకున్నారు. ఇందులో ఎమోషన్స్ బాగా పండాయి. పాటలు, సంగీతం బాగా కుదిరిందని అని చెప్పుకొచ్చారు.
మరిన్ని ఇక్కడ చదవండి :