AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pournami Movie: ‘పౌర్ణమి’ సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే..

సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే ఇందులో హీరోయిన్ సింధు తులానీ కూడా నటించింది. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ప్రభాస్ ను ఇష్టపడే వివాహిత మోహని పాత్రలో నటించి అలరించింది. ఆ హీరోయిన్ పేరు మధు శర్మ.

Pournami Movie: 'పౌర్ణమి' సినిమాలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా..? ఇప్పుడేం చేస్తుందంటే..
Madhu Sharma
Rajitha Chanti
|

Updated on: Aug 25, 2024 | 3:45 PM

Share

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‏లో వన్ ఆఫ్ ది హిట్ మూవీ పౌర్ణమి. ఈ మూవీ అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రభాస్ సరసన త్రిష, ఛార్మీ హీరోయిన్లుగా నటించారు. గతంలో వర్షం సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రభాస్, త్రిష జోడి.. మరోసారి పౌర్ణమి మూవీతో మెప్పించారు. సుమంత్ ఆర్ట్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై ఎంఎస్ రాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాగే ఇందులో హీరోయిన్ సింధు తులానీ కూడా నటించింది. ఈ మూవీలోని సాంగ్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. ప్రభాస్ ను ఇష్టపడే వివాహిత మోహని పాత్రలో నటించి అలరించింది. ఆ హీరోయిన్ పేరు మధు శర్మ.

ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు హిందీ, మరాఠీ భాషలలో పలు చిత్రాల్లో అలరించింది. ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలలో నటించింది. తమిళంలో గురు పర్వాయ్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ నార్త్ ఇండియన్ బ్యూటీ.. ఆ తర్వాత విలక్షణ నటుడు జగపతి బాబు హీరోగా నటించిన పాండు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. శివాజీ, లయ హీరోహీరోయిన్లుగా నటించిన అదిరిందయ్యా చంద్రం, శ్లోకం, గౌతమ్ ఎస్ఎస్సీ చిత్రాల్లో నటించింది. అలాగే అల్లరి నరేష్, శశాంక్ సరసన పార్టీలో నటించింది.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత పౌర్ణమి చిత్రంలో మోహిని పాత్రలో నటించింది. ఇందులో 60 ఏళ్ల ఏవీఎస్ కు భార్యగా కనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో శ్రీహరి హీరోగా నటించిన హనుమంతు, బ్రహ్మా చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. తెలుగు, హిందీ, తమిళంలో వరుస సినిమాలు చేసిన మధుశర్మ భోజ్ పురిలో సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా మధుశర్మ లేటేస్ట్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

View this post on Instagram

A post shared by Madhhu Shharma (@madhhuis)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.