
సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతూ కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో రాబడుతున్నాయి. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా కూడా కలెక్షన్స్ మాత్రం కుమ్మేస్తున్నాయి. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో విడుదలవుతున్నాయి. అలాగే హీరో హీరోయిన్స్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక హీరోయిన్స్ కూడా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఇండస్ట్రీలోనే తోపు.. అందరి కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ ఈ అమ్మడే..
చాలా మంది ముద్దుగుమ్మలు హీరోలకు సరి సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. కొంతమంది సీనియారిటీతో.. మరికొంతమంది స్టార్ డమ్ తో భారీగా పారితోషకాలు అందుకుంటున్నారు. మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కు వరుసగా 7 ఫ్లాపులు ఉన్నాయి. అయినా కూడా భారీగా రెమ్యునరేషన్ అందుకుంటుంది. ఆ అందాల భామ మరెవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రియాంక చోప్రా అక్కడ అందరు స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.
ఆతర్వాత హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు తెలుగులో నటిస్తుంది. గతంలో రామ్ చరణ్ తో కలిసి జంజీర్ అనే సినిమా చేసింది. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వారణాసి సినిమాలో నటిస్తుంది. ప్రియాంక చోప్రా స్టార్ హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. వరుసగా 7 ఫ్లాపులు ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ రెమ్యునరేషన్ విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. కాగా వారణాసి సినిమా కోసం ప్రియాంక ఏకంగా రూ. 25కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. చెప్పాలంటే ఇండియాలోనే భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్ ఈ అమ్మడే.. స్టార్ హీరోయిన్స్ నయనతార, త్రిష 11 నుంచి 15 కోట్ల వరకు మాత్రమే అందుకుంటున్నారు. ఇక బాలీవుడ్ లో తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో సీతగా నటిస్తున్న సాయి పల్లవి రూ. 20కోట్లు తీసుకుంటుందని టాక్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.