
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీల హడావిడి ఎక్కువైంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ జోరు మీదున్నారు. కొంతమంది ముద్దుగుమ్మలు ఒకేఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోతున్నారు. సినిమా సినిమాకు కొత్త కొత్త హీరోయిన్స్ తెరపై సందడి చేస్తున్నారు. అయితే మరికొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన హిట్లు మాత్రం అందుకోలేకపోతున్నారు. సినిమాల రిజెల్ట్ తో సంబంధాలు లేకుండా వరుసగా ఛాన్స్ లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ అమ్మడు కూడా అంతే .. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు వచ్చింది ఈ చిన్నది. తెలుగులో వరుసగా ఆఫర్స్ అందుకుంది. సినిమాలు హిట్స్ అవ్వకపోవడంతో గ్లామర్ గేట్లు ఎత్తేసింది.
తన అందాలతో ప్రేక్షకులను కవ్వించినా.. తెలుగులో ఆరు సినిమాలు చేసింది కానీ ఒకే ఒక్క సినిమా హిట్ అయ్యింది. అయినా కూడా ఈ చిన్నదానికి క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు చేసింది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందానికి ఫిదా అవ్వని కుర్రాడు ఉండడు. అందంలో అప్సరస ఆమె.. నటనలోనూ ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులో సాలిడ్ హిట్ కోసం ఇప్పుడు ఎదురుచూస్తుంది ఈ మ్మాడు. తక్కువ సమయంలోనే స్టార్ గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆమె మరెవరో కాదు టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్. టైగర్ ష్రాఫ్ నటించిన మున్నా మైఖేల్ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. మిస్టర్ మజ్ను, ఆతర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. కానీ ఈ సినిమాలో తన అందంతో ఆకట్టుకుంది. సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్, హీరోలు సినిమాలు చేసింది. కానీ ఈ సినిమాల్లో ఒక ఒక్క సినిమా ఆ హిట్ అయ్యింది. మొత్తంగా ఈ చిన్నది తెలుగులో 5 సినిమాలు చేసింది. వాటిలో ఒకే ఒక్క హిట్ అందుకుంది. ఇప్పుడు రెండు పాన్ ఇండియా సినిమాలు చేసింది. వాటిలో పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమా, అలాగే ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమాలు చేసింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆకట్టుకోలేకపోయాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కవ్విస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.