Tollywood: సొంతంగా ఐపీఎల్ టీమ్ ఉన్న నిర్మాత ఎవరో తెలుసా.. సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్..

|

Oct 14, 2024 | 12:29 PM

1999లో ప్రారంభమైన అతడి కంపెనీ మొదట్లో సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పనిచేసింది. ఆ తర్వాత వరుసగా సక్సెస్ అందుకుంటూ భారతదేశంలోనే అత్యంత ధనిక నిర్మాతగా ఎదిగారు. తెలుగుతోపాటు తమిళంలో అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. ఇండస్ట్రీలో అనేక చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఆ నిర్మాత ఇప్పుడు సొంతంగా IPL జట్టును కలిగి ఉన్నాడు. అతడు మరెవరో కాదు..

Tollywood: సొంతంగా ఐపీఎల్ టీమ్ ఉన్న నిర్మాత ఎవరో తెలుసా.. సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్..
Ipl 2024
Follow us on

సౌత్ ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన ఓ నిర్మాతకు సొంతంగా ఐపీఎల్ జట్టు ఉందనే విషయం మీకు తెలుసా.. ? అవును.. ఓవైపు సినిమాలను నిర్మిస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే పలు బిజినెస్ రంగాల్లో పెట్టుబడి పెట్టిన ఆ నిర్మాత.. అటు క్రికెట్ అంటే ఎక్కువగా ఆసక్తి ఉండడంతో సొంతంగా ఐపీఎల్ టీమ్ కొనుగోలు చేసి ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ లో రాణిస్తున్నారు. 1999లో ప్రారంభమైన అతడి కంపెనీ మొదట్లో సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పనిచేసింది. ఆ తర్వాత వరుసగా సక్సెస్ అందుకుంటూ భారతదేశంలోనే అత్యంత ధనిక నిర్మాతగా ఎదిగారు. తెలుగుతోపాటు తమిళంలో అనేక సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి విజయం సాధించారు. ఇండస్ట్రీలో అనేక చిత్రాలను నిర్మించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన ఆ నిర్మాత ఇప్పుడు సొంతంగా IPL జట్టును కలిగి ఉన్నాడు. అతడు మరెవరో కాదు.. సన్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ యజమాని కళానిధి మారన్. భారతదేశంలోనే అత్యంత ధనిక చిత్ర నిర్మాత.

1999లో ప్రారంభించబడిన సన్‌పిక్చర్స్ మొదట సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా పనిచేసింది. కానీ ఇప్పుడు సినీరంగంలోనే కాకుండా క్రీడలలోనూ రాణిస్తుంది. ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ యజమాని కళానిధి మారన్ ఆస్తులు రూ.30 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సన్ పిక్చర్స్ ఎంథిరన్, పెట్టా, మృగం, జైలర్, రాయన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను నిర్మించింది. దివంగత మాజీ కేంద్ర మంత్రి తనయుడు కళానిధి మారన్, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సోదరుడు. 1990లో సన్ టీవీని ప్రారంభించిన కళానిధి మారన్.. సక్సెస్ తర్వాత సక్సెస్‌లు సాధిస్తూనే ఉన్నాడు.

పీఎల్ క్రికెట్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని అయిన కళానిధి మారన్ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ అయిన స్పైస్‌జెట్ యజమాని కూడా. ప్రస్తుతం ఐపీఎల్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును కళానిధి మారన్ ఏకైక కుమార్తె కావ్య మారన్ చూసుకుంటున్నారు. కావ్య మారన్ దక్షిణాదిలో చాలా పాపులర్. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయాల్లో స్టేడియంలో కావ్య పేరు మారుమోగుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.