
జూనియర్ ఎన్టీఆర్… పాన్ ఇండియా లెవల్లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరో. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని గ్లోబల్ స్టార్ గా మారారు. ఇక ఆ తర్వాత దేవర సినిమాతో మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం వార్ 2 చిత్రంతోపాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టులో నటిస్తున్నారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వార్ 2 చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు తారక్. ఇదిలా ఉంటే.. తాజాగా తారక్ ఫస్ట్ మూవీ రెమ్యునరేషన్ గురించి ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. చిన్న వయసులోనే హీరోగా మారారు. కెరీర్ తొలినాళ్లల్లోనే అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నిన్ను చూడాలని సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. 2001లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే నివేదికల ప్రకారం ఈ సినిమాకు ఎన్టీఆర్ కేవలం రూ.4 లక్షలు పారితోషికం తీసుకున్నారట. అయితే ఆ డబ్బు ఏం చేయాలో ఎన్టీఆర్ కు అర్థం కాలేదట. తన దగ్గర ఉంటే డబ్బును విలాసంగా ఖర్చు చేస్తానేమో అనే సందేహంతో తన మొదటి పారితోషికాన్ని నేరుగా తన తల్లి చేతిలో పెట్టారట. తారక్ నటించిన ఫస్ట్ మూవీ కమర్షియల్ హిట్ కాకపోయిన తన నటనకు మంచి మార్కులు కొట్టేశారు.
లవ్ స్టోరీస్ అయినా, మాస్ యాక్షన్ మూవీస్ అయినా తన పాత్రలో అద్భుతమైన నటనతో అదరగొట్టారు తారక్. ఇటీవలే దేవర సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఈ సినిమాకు తారక్ రూ.60 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు టాక్. అలాగే ఇఫ్పుడు వార్ 2, డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలకు అదే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట.
ఇవి కూడా చదవండి :
Damarukam Movie: ఢమరుకం మూవీ విలన్ భార్య తెలుగులో తోపు హీరోయిన్.. ఇంతకీ ఆమె ఎవరంటే..