Zombie Reddy: మ‌ళ్లీ భ‌య‌పెట్ట‌డానికి వ‌స్తోన్న జాంబీలు..? క‌రోనా సెకండ్ వేవ్ ప్రేర‌ణతో..

|

May 11, 2021 | 10:17 PM

Zombie Reddy: జాంబీ రెడ్డి.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను తొలిసారి జాంబీల‌ను ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. హాలీవుడ్‌కు ప‌రిమిత‌మైన ఇలాంటి కొత్త జోన‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం చేశాడు...

Zombie Reddy: మ‌ళ్లీ భ‌య‌పెట్ట‌డానికి వ‌స్తోన్న జాంబీలు..? క‌రోనా సెకండ్ వేవ్ ప్రేర‌ణతో..
Zombie Reddy
Follow us on

Zombie Reddy: జాంబీ రెడ్డి.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను తొలిసారి జాంబీల‌ను ప‌రిచ‌యం చేసిన సినిమా ఇది. హాలీవుడ్‌కు ప‌రిమిత‌మైన ఇలాంటి కొత్త జోన‌ర్‌ను ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ తెలుగు ప్రేక్ష‌కులకు ప‌రిచ‌యం చేశాడు. క‌రోనా స‌మ‌యంలో వ‌చ్చిన ఆలోచ‌నతో ప్ర‌శాంత్ ఈ సినిమా క‌థ‌ను రాసుకున్నాడు. క‌రోనాను అరిక‌ట్ట‌డానికి ఓ సైంటిస్ట్ త‌యారు చేసిన వ్యాక్సిన్ విక‌టించ‌డంతో ప్ర‌జ‌లు జాంబీలుగా మారడం అనే వినూత్న క‌థాంశంతో ప్ర‌శాంత్ ఈ సినిమాను తెర‌కెక్కించాడు.
ఇక ఈ సినిమా ప్రేక్ష‌కుల‌ను బాగానే ఆక‌ట్టుకుంది. థియేట‌ర్ల‌తో పాటు ఓటీటీ వేదిక‌గా వ‌చ్చిన ఈ సినిమా మంచి ప్ర‌జాద‌ర‌ణ పొందింది. ఇదిలా ఉంటే క‌రోనా సెకండ్ వేవ్ దేశాన్ని కుదిపేస్తోన్న వేళ ప్ర‌శాంత్‌లో మ‌రో ఆలోచ‌న మొద‌లైన‌ట్లు స‌మాచారం. జాంబీరెడ్డికి సీక్వెల్ తెర‌కెక్కించే ప‌నిలో ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్ప‌టికే ఈ సీక్వెల్ ప‌నులు మొద‌లు పెట్టాడ‌ని, దీనిపై హీరో తేజ‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌రి జాంబీ రెడ్డి సీక్వెల్‌పై వ‌స్తోన్న‌వార్త‌ల‌పై క్లారిటీ రావాలంటే అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే వ‌ర‌కు వేచి చూడాల్సిందే. ఇక జాంబీ రెడ్డి చిత్రంలో హీరో తేజ మంచి న‌ట‌న‌ను క‌న‌బ‌ర‌చ‌గా.. ఆనంది, ద‌క్ష నగ‌ర్క‌ర్‌, హేమంత్‌, గెట‌ప్ శ్రీను త‌మ పాత్ర‌ల మేర‌కు ఆక‌ట్టుకున్నారు. మ‌రి సీక్వెల్‌లో వీరే న‌టిస్తున్నారా.? న‌టీన‌టులు మారుతారో చూడాలి

Also Read: దేవాదాయ శాఖ కీలక నిర్ణయం.. బుధవారం నుంచి ఆలయాల్లో దర్శనాలు నిలివేస్తున్నట్లుగా ప్రకటించిన మంత్రి

Chiranjeevi : TNR కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన మెగాస్టార్.. కనీటిపర్యంతం అయిన TNR సతీమణి..

Kajal Aggarwal: హీరోయిన్ల‌కు పెళ్ల‌యితే సినిమాలు త‌గ్గుతాయా?.. ఆ మాట అనేముందు ఒక్క‌సారి కాజ‌ల్ ఫిల్మోగ్ర‌ఫీ చూడండి