AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేంది మావ..! ఈ మాజీ సీఎం భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయినా..! ఇప్పుడేం చేస్తుందంటే

కొంతమంది మంది హీరోయిన్స్ సినిమాలకోసం చాలా కష్టపడుతూ ఉంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఎంచుకుంటూ దూసుకుపోతున్నారు. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ రోల్స్ కే పరిమితం అవుతున్నారు. కానీ కొంతమంది మాత్రం ఇలా విభిన్నమైన కథలను, పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు.

ఇదేంది మావ..! ఈ మాజీ సీఎం భార్య టాలీవుడ్ క్రేజీ హీరోయినా..! ఇప్పుడేం చేస్తుందంటే
Kumara Swamy
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2025 | 12:30 PM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా మంది వ్యవరవేత్తలను పెళ్లిళ్లు చేసుకున్నారు. మరికొంతమంది హీరోలను, నిర్మాతలను పెళ్లి చేసుకున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే రాజకీయనాయకులను వివాహం చేసుకున్నారు. అలాగే ఓ టాలీవుడ్ హీరోయిన్ కూడా ఓ రాజకీయ నాయకుడిని వివాహం చేసుకుంది. ఆయన ఏ చిన్న రాజకీయనాయకుడో కాదు.. సొంత పార్టీ పెట్టి.. ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయనే హరదనహళ్ళి దేవెగౌడ కుమారస్వామి. కన్నడ రాజకీయాల్లో ఆయన తెలియని వారు ఉండరు. అయితే ఈయన సతీమణి టాలీవుడ్ హీరోయిన్ అని చాలా మందికి తెలియదు. అందం అభినయం కలబోసినా ఆమె తన సినిమాలతో మెప్పించారు. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

కుమార స్వామి భార్య పేరు రాధిక కుమారస్వామి. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రాధికా .. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కన్నడ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ గా రాణించింది ఈ అమ్మడు. 2000 ఏడాదిలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇక  రాధికా చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమా చేసే సమయంలో ఆమె 9వ తరగతి చదువుతుంది. కన్నడ బాషాలో వరుసగా సినిమాలు చేసిన ఆమె తమిళ్ లోనూ సినిమాలు చేసింది. యార్కాయి అనే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తెలుగులో దివంగత నటుడు తారకరత్న నటించిన భద్రాద్రి రాముడు సినిమాలో నటించింది. 2004లో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో రాధికా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఆతర్వాత అవతారం అనే సినిమాలో నటించింది. ఆతర్వాత ఆమె తెలుగులో సినిమాలు చేయలేదు. 2018 వరకు సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే రాధికా రెండు సినిమాలను నిర్మించింది కూడా.. కాగా కుమారస్వామిని రాధికా వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయనకు అనిత కుమారస్వామితో వివాహం అయ్యింది. అటు రాధికాకు కూడా అది రెండో వివాహమే.. అంతకు ముందు ఆమె రతన్ కుమార్ ను వివాహం చేసుకుంది.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.