Deepika Padukone: ‘ఇప్పుడు నీ ఇష్టం ఏమైంది.. డబ్బు కోసం ఏమైనా చేసేస్తావా?’

అప్పటి మాటలు.. ఇప్పుడు మంటలు రేపుతున్నాయి. నా ఇష్టం అంటూ గతంలో చెప్పుకొచ్చిన దీపికా పదుకొణె.. ఇప్పుడు అదే అంశం కాంట్రవర్సీకి కారణమైంది. లేటెస్ట్‌గా రణ్‌వీర్ సింగ్‌తో అబుదాబిలో యాడ్‌లో కనిపించిన దీపికా.. హిజాబ్‌ ధరించడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు నీ ఇష్టం ఏమైంది.. డబ్బు కోసం ఏమైనా చేసేస్తావా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం కండిషన్స్ తెలుసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని వాదిస్తున్నారు.

Deepika Padukone: ఇప్పుడు నీ ఇష్టం ఏమైంది.. డబ్బు కోసం ఏమైనా చేసేస్తావా?
Deepika Ranveer

Updated on: Oct 10, 2025 | 8:29 PM

బాలీవుడ్‌ నటి దీపిక పదుకొణె మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఇటీవ‌ల సినిమాల కంటే వివాదాల ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు ఈ బ్యూటీ. కొన్ని రోజుల క్రితం అటు ‘స్పిరిట్‌’ ఇటు ‘కల్కి సీక్వెల్‌ నుంచి దీపికాను తప్పించడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు మరింత సెన్సెషనల్‌గా మారాయి. అయితే ఈ సారి ఒక కమర్షియల్ యాడ్‌ ద్వారా ఈ బ్యూటీ సోషల్‌ మీడియా ట్రెండింగ్‌గా మారారు.


దీపిక తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అబుదాబి టూరిజం బోర్డు రూపొందించిన ఒక యాడ్‌లో కనిపించారు. వీరిద్దరూ అబుదాబి అందాలను చూపిస్తూ, అక్కడి కల్చర్‌ అండ్‌ ట్రెడిషన్‌ని ప్రమోట్‌ చేశారు. మొదట్లో ఆ వీడియో సాధారణ ప్రమోషనల్‌ కంటెంట్‌లానే అనిపించింది. కానీ యాడ్‌లో దీపిక ధరించిన హిజాబ్‌, షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మసీదులో ఉన్న సీన్లు ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి.

డబ్బుల కోసం ఏదైనా చేసేస్తావా?, హిందూ ఐకాన్‌గా ఉన్న నువ్వు హిజాబ్ ఎందుకు వేసుకున్నావు.. అంటూ సోషల్‌ మీడియాలో దీపిక పదుకొణె తీరుపై నెటిజన్లు మండిపడుతన్నారు. మరికొందరు మాత్రం అది కేవలం సాంస్కృతిక గౌరవ సూచకం మాత్రమేనని… రాద్దాంతం చేయొద్దంటూ ఆమెకు మద్దతు ఇస్తున్నారు. షేక్‌ జాయెద్‌ గ్రాండ్‌ మసీదుని సందర్శించాలంటే ఎవరైనా సరే హిజాబ్ ధరించాల్సిందేనని, అక్కడి షరతులు తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని దీపికకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ వివాదం జాతీయస్థాయిలో వైరల్‌ అవుతుండగా హ్యాష్‌ట్యాగ్‌ #BoycottDeepika కూడా ట్రెండ్‌ అవుతోంది.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీపిక… తాను ఎక్కడ పని చేసినా, అక్కడి సంస్కృతిని గౌరవించడం తన వ్యక్తిగత అభిప్రాయం. దాన్ని తప్పుగా చూడకూడదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలు వివాదాలతో రెండు భారీ ప్రాజెక్టులు వదులుకున్న దీపికా.. ఈ యాడ్‌ వివాదంపై ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి.

కాగా ఈ పరిణామాల వేళ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. దీపికా పదుకొణెకు కేంద్రం కీలక బాధ్యతలు అప్పగించింది. భారతదేశపు తొలి ‘మానసిక ఆరోగ్య అంబాసిడర్‌గా’ ఆమెను నియమించింది.

Follow Us