
దివంగత హాస్యనటుడు రాజబాబు పిల్లలు మహేష్ బాబు, నాగేంద్ర బాబులు కెరీర్లో ఉన్నత స్థానాకలు వెళ్లిన వైనాన్ని.. ఆయన సోదరుడు చిట్టిబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తండ్రి రాజబాబు ఆకస్మిక మరణం నాటికి మహేష్ బాబు, నాగేంద్ర బాబులు కేవలం 9, 11 సంవత్సరాల వయస్సులోనే ఉన్నారు. ఆ చిన్న వయస్సులో భవిష్యత్తుపై స్పష్టత లేని ఆ పిల్లలను వారి తల్లి, చిట్టి బాబు వదినగారు.. ఎంతో డెడికేషన్తో పెంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఆమె పిల్లలను బీఎస్సీ చదివించి, ఆ తర్వాత ప్రత్యేక కంప్యూటర్స్ కోర్స్ పూర్తి చేయించారు. అప్పట్లో కంప్యూటర్ రంగం ప్రారంభ దశలో ఉన్నప్పటికీ, వారు సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మహేష్ బాబు, నాగేంద్ర బాబులు అమెరికా వెళ్లి, అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం వారు అమెరికాలో తమ సొంత సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు. పది కోట్ల రూపాయల విలువైన ఇంట్లో నివసిస్తూ, ఆర్థికంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. ముఖ్యంగా, మనం ఉపయోగించే కార్లలోని జీపీఎస్ రూట్ మ్యాప్ సాఫ్ట్వేర్ను కనిపెట్టిన ఘనత వీరి కంపెనీదేనని చిట్టి బాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
రాజబాబు పెద్ద కొడుకు మహేష్ బాబుకు పెళ్లయి ఒక పాప (సైన్య), బాబు (రాజబాబు) ఉన్నారు. వీరికి సినీరంగంపై ఎటువంటి ఆసక్తి లేదని చిట్టి బాబు తెలిపారు. తన అన్నయ్య రాజబాబు వారిని సినిమాల్లో చూపించాలని ప్రయత్నించినా, వారి ఆసక్తి సాఫ్ట్వేర్ రంగంలోనే ఉందని స్పష్టం చేశారు. వారి తల్లి గొప్ప త్యాగం, కృషి వల్లే పిల్లలు ఈ స్థాయికి చేరుకున్నారని, ఆమెకు ప్రతి పాదాభివందనం చేసినా తక్కువే అని చిట్టి బాబు అన్నారు. చిట్టి బాబు తన కుటుంబంలో కూడా ఇదే విధమైన విజయాలు ఉన్నాయని పంచుకున్నారు. తన కుమార్తె బీఎస్సీ పూర్తి చేసి, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకుని, ఆరు కోట్ల విలువైన ఇంట్లో అమెరికాలో స్థిరపడ్డారని తెలిపారు. ఆమెకు ఇద్దరు బాబులు. తన తమ్ముడు బాబీ కుమార్తె ఇంజనీర్ పూర్తి చేసి, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ను వివాహం చేసుకుని బెంగళూరులో స్థిరపడింది. ఆమెకు ఒక బాబు ఉన్నాడు. అలాగే, తన మేనల్లుడు ఆనంద్ ఇంజనీరింగ్ చేసి, అమెరికాలో ఎంఎస్, డాక్టరేట్ పూర్తి చేసి మెడికల్ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడ్డాడు. ఈ కథలు విద్యా, కృషి ద్వారా ఏ రంగంలోనైనా ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని నిరూపిస్తాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.