బాలీవుడ్ నటులు టాలీవుడ్ లో విలన్స్ గా తమ సత్తా చాటుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో విలన్ అంటే టక్కున గుర్తొచ్చేది ఇద్దరి పేర్లే అవి సంజయ్ దత్, బాబీ డియోల్. హీరోల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న విలన్లు ఈ ఇద్దరూ. హీరోను ఎలివేట్ చెయ్యాలంటే ఆ సినిమాలో విలన్ అంత పవర్ఫుల్ గా ఉండాలి అందుకోసం ఇప్పుడు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులను ఎంచుకుంటున్నారు మన టాలీవుడ్ దర్శకులు. ‘యానిమల్’తో బాబీ డియోల్ సంచలనం సృష్టించినప్పటి నుంచి అతని పేరు టాలీవుడ్ లో మారుమ్రోగుతుంది. యానిమల్ సినిమా తర్వాత బాబీకి టాలీవుడ్, బాలీవుడ్ లో భారీ ఆఫర్స్ వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో బాబీ పేరు ఎక్కువగా వినిపిస్తుంది.
ఇక కేజీఎఫ్ 2 విజయం తర్వాత సంజయ్ దత్ కూడా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. కానీ బాబీ డియోల్ ఎంట్రీ తర్వాత, డిమాండ్ కొంచెం తగ్గిందని టాక్ వినిపిస్తుంది. బాబీ డియోల్ ఇంతకు ముందు చాలా సార్లు నెగెటివ్ క్యారెక్టర్స్ చేసినప్పటికీ, యానిమల్ అతని కెరీర్కు మంచి మైలేజ్ ఇచ్చింది. విలన్ పాత్రల్లో సంజయ్ అదరగొట్టిన సినిమాలు చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు బాబీ డియోల్ విలన్ గా వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
యానిమల్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాబీకి వరుస ఆఫర్స్ వస్తున్నాయి. బాలీవుడ్ లో సైఫ్ అలీఖాన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో బాబీ డియోల్కి విలన్గా ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇఅలాగే తమిళ్ లో స్టార్ హీరో సూర్య ‘కంగువ’లోనూ విలన్ గా నటిస్తున్నాడు బాబీ. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలైంది, అందులో ‘ఉధిరన్’ అనే డేంజరస్ లుక్ లో కనిపించాడు బాబీ. ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ తదుపరి చిత్రం ‘NBK 109’ లో నటిస్తున్నాడు. ఇటీవలే బాబీ డియోల్ ఈ సినిమా షూటింగ్ను పూర్తి చేశాడు. మరోవైపు, పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు సినిమాలో బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నాడు. రామ్చరణ్, జాన్వీ కపూర్ల RC16 లో విలన్ పాత్రను బాబీ డియోల్ ఆఫర్ చేసినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. అలాగే బాలీవుడ్ లో మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైనప్ చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.