
2008 నుండి ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తున్న అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అమెరికా లో ని పలు నగరాలలో ఈ ఆగష్టు లో పలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంది దాని లో భాగంగా మొన్న ఆదివారం ఆగష్టు 17వ తారీఖున ఆప్త మెగా బ్లడ్ కమిటీ వైస్ చైర్ సునీల్ నల్లాల , ఆప్త జాయింట్ సెక్రటరీ సప్తగిరిష్ ఇండుగుల, టాలెంట్ సెర్చ్ చైర్ కళ్యాణ్ పోలసి, స్టేట్ కోఆర్డినేటర్ కిషోర్ గుద్దటి, మెంబర్షిప్ చైర్ శ్రీనివాస్ మత్తి ఆద్వర్యంలో డెట్రాయిట్ లో ఆప్త మరియు అమెరికన్ రెడ్ క్రాస్ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు . చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్ఫూర్తి తో మొదలయిన ఈ రక్తదాన శిబిరం వియయవంతంగా నిర్వహించబడింది , నెక్స్ట్ జనరేషన్ టెన్స్ మరియు మహిళలు కూడా ఈ రక్త దాన శిబిరం లో పాల్గొనడం మరొక ప్రత్యేకత..
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా ఆప్త ప్రెసిడెంట్ మధు ఉల్లి పాల్గొన్నారు , ఈ రక్తదాన శిబిరాలు అమెరికా లోని టెక్సాస్ , న్యూ జెర్సీ , ఇల్లినాయిస్ , ఒహియో , కాలిఫోర్నియా,వాషింగ్టన్ , వర్జీనియా మరియు పలు రాష్ట్రాలలో నిర్వహిస్తామని ఆప్త అధ్యక్షులు మధు ఉల్లి మరియు మెగా బ్లడ్ కమిటీ చైర్ సంతోష్ యాతం,వైస్ చైర్ సునీల్ నల్లాల మీడియా కి చెప్పారు.
2008 నుండి ఇప్పటి వరకు దాదాపు ఇరవై కోట్ల రూపాయల స్కాలర్ షిప్ని పేద విద్యార్థులకు అందించిన ఆప్త అలాగే ఎన్నో మెడికల్ క్యాంప్స్ ఉచితంగా నిర్వహిస్తూ అమెరికా, ఇండియా లో రక్త దాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్న ఆప్త ప్లాటినం సీల్ అఫ్ ట్రాన్స్పరెన్సీ గుర్తింపు ని గైడ్ స్టార్ సంస్థ నుండి అందుకుంది .. . ఇప్పటికి కొన్ని వేల యూనిట్స్ రక్త దానం అందించి ఎన్నో ప్రాణాలు నిలబెట్టి ఆప్త అందరికీ ఆదర్శ ప్రాయంగా నిలిచింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.