Bigg Boss 8 Telugu: హీటెక్కిన నామినేషన్స్.. మణికంఠ సెంటిమెంట్ స్టోరీ.. సోనియా దెబ్బ అదుర్స్..

|

Sep 04, 2024 | 8:54 AM

చీఫ్‌లు ముగ్గురి మెడలో ఓ పూసల దండ వేయించి ఆ ముగ్గురిన్సి సపరేట్ గా కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు బిగ్ బాస్. ఆతర్వాత మిగిలిన వారు నామినేషన్స్ మొదలుబెట్టారు. సోనియాతోనే నామినేషన్స్ మొదలు పెట్టారు. ఈ అమ్మడు ఓ రేంజ్ లో వాయించింది. సోనియా ముందుగా బెబక్కను నామినేట్ చేసింది.

Bigg Boss 8 Telugu: హీటెక్కిన నామినేషన్స్.. మణికంఠ సెంటిమెంట్ స్టోరీ.. సోనియా దెబ్బ అదుర్స్..
Bigg Boss 8
Follow us on

బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో నామినేషన్స్ చాలా హీట్ గా సాగింది. బిగ్ బాస్ లో నామినేషన్స్ ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే.. నామినేషన్ అని పేరు ఎత్తగానే గొడవలు, గోలలు, అరుపులు , ఏడుపులు అబ్బో నానా రచ్చ ఉంటుంది. నిన్నటి ఎపిసోడ్ లోనూ అదే జరిగింది. చీఫ్‌లు ముగ్గురి మెడలో ఓ పూసల దండ వేయించి ఆ ముగ్గురిన్సి సపరేట్ గా కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు బిగ్ బాస్. ఆతర్వాత మిగిలిన వారు నామినేషన్స్ మొదలుబెట్టారు. సోనియాతోనే నామినేషన్స్ మొదలు పెట్టారు. ఈ అమ్మడు ఓ రేంజ్ లో వాయించింది. సోనియా ముందుగా బేబక్కను నామినేట్ చేసింది. కిచన్ లో ఆమె అంతగా రెస్పాన్స్ బుల్ గా ఉండటంలేదు అని అని సోనియా అంది. కుక్కర్ వాడటం రాకపోతే చెప్పాలి కానీ మమ్మల్ని ఆకలితో ఉంచుతారా.? అంటూ సోనియా బేబక్కను నామినేట్ చేసింది. కిచన్ హ్యాండిలింగ్ మీద గట్టిగానే మాట్లాడింది సోనియా. బేబక్కకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ లోగా మధ్యలో వచ్చిన చీఫ్ లకు కూడా గట్టిగానే సమాధానం చెప్పింది.

ఇది నా గేమ్ నా నామినేషన్.. చీఫ్స్‌ ఏం జడ్జీలు కాదు.. నన్ను మాట్లాడనివ్వండి అంటూ ఇచ్చిపడేసింది సోనియా. ఆతర్వాత ప్రేరణను నామినేట్ చేసింది. నువ్వు ఇది ఓ పిక్నిక్ లా ఎంజాయ్ చేస్తున్నావ్. ఎవరైనా గొడవ పడుతుంటే అక్కడికి వెళ్లి ఎందుకు కావాలని గొడవ పడుతున్నారంటూ డైలాగ్‌లు వేస్తున్నావ్ ఇది కరెక్ట్ కాదు అంటూ నామినేట్ చేసింది. దాంతో ప్రేరణ డిఫైన్ చేసుకోవడానికి ట్రై చేసిన సోనియా ఛాన్స్ ఇవ్వలేదు. ప్రేరణ కొద్దిసేపు ఎగిరిన సోనియా దెబ్బకు సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత సోనియా నామినేట్ చేసిన వారిలో ఒకరిని మాత్రమే సేవ్ చేయాల్సిన బాధ్యత చీఫ్ లై ఉండటంతో యష్మి బేబక్క సెలక్ట్ చేసి ప్రేరణను సేవ్ చేసింది.

ఆ తర్వాత నబీల్‌ వచ్చి మణికంఠను నామినేట్ చేశాడు. ఎవరితోనూ మాట్లాడడు. ఒంటరిగా ఉంటాడు.. కెమెరాల ముందే ఏదో చెప్పుకుంటాడు.. మింగిల్ అవడం అంటూ నబీల్ చెప్పాడు. దానికి మణికంఠ సెంటిమెంట్ స్టోరీ మొదలుపెట్టాడు. 2015నుంచి నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నా.. అంటూ చెప్పుకొచ్చాడు. దానికి నబీల్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ హైలైట్. మణికంఠ స్టోరీకి నిఖిల్ బ్రేక్ వేశాడు. ఆ తర్వాత బేబక్కను నామినేట్ చేశాడు నబీల్. వీరిలో నాగ మణికంఠను నామినేట్ చేసి.. బేబక్కను సేవ్ చేసింది యష్మీ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి