
అస్వస్థతకు గురైన పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. జ్వరం కారణంగా ఎట్హోమ్ కార్యక్రమానికి పవన్ దూరంగా ఉన్నారు. రాజమండ్రిలో పవన్ కల్యాణ్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం హైదరాబాద్కు పవన్ కళ్యాణ్ పయనమైయ్యారు. ఇటీవల పవన్ కుడి భుజానికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో, ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నారు.