Vaarasudu: విజయ్ వారసుడుకు మరో షాక్.. నోటీసులు జారీ చేసిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. ఏమైందంటే

|

Nov 24, 2022 | 8:26 PM

ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

Vaarasudu: విజయ్ వారసుడుకు మరో షాక్.. నోటీసులు జారీ చేసిన యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా.. ఏమైందంటే
Varisu
Follow us on

తమిళ్ స్టార్ హీరోలో దళపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వారసుడు. ఈ సినిమా తమిళ్ లో వారీసు అనే టైటిల్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి.ఈ సినిమాకు 250కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిందట. ఈ సినిమాను వంశీ తన స్టైల్ లో కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కికిస్తున్నారు.  ఇదిలా ఉంటే ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ సినిమానా లేక తెలుగు సినిమానా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

ఈ విషయం పై ప్రొడ్యూసర్ దిల్ రాజు స్పందిస్తూ ఈ సినిమా తమిళ్ సినిమా అని తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. అయితే సంక్రాంతి సమయంలో డబ్బింగ్ సినిమాలకు ప్రధాన్యత ఇవ్వకూడదని నిర్మాతల మండలి కూడా ప్రకటించడంతో దీనిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఈ సినిమాలో అనుమతి లేకుండా ఏనుగులను ఉపయోగించారని యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ మేరకు నిర్మాత దిల్ రాజుకు నోటీసులు పంపించారు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వణ్యప్రాణి సంరక్షణ చట్టం 1972 రూల్ 7(2) షెడ్యూల్ 1 ప్రకారం ఏనుగులకు రక్షణ కల్పిస్తూ చట్టం ఉంది. దీని ప్రకారమే వారీసు చిత్ర నిర్మాత దిల్ రాజుకు నోటీసులు పంపించారు, దీని పై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

Varasudu