Shobhan babu: శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే.. కుండబద్దలు కొట్టిన స్టార్ నటి..

నటనలో రాజసం, వ్యక్తిత్వంలో నిరాడంబరత కలగలిసిన సోగ్గాడు శోభన్ బాబు. ఆయన మరణానికి ముందు అత్యంత సన్నిహితురాలైన నటి రాజశ్రీకి ఫోన్ చేసి చెప్పిన ఆ చివరి మాటలేమిటి? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీపై లుక్కేయండి మరి. అదేంటంటే.?

Shobhan babu: శోభన్ బాబు చనిపోయే ముందు చివరిగా ఫోన్ చేసి చెప్పిన మాట ఇదే.. కుండబద్దలు కొట్టిన స్టార్ నటి..
Shobhan Babu

Updated on: Apr 24, 2026 | 9:10 PM

తెలుగు సినిమా చరిత్రలో ‘సోగ్గాడు’గా, ‘ఆంధ్రా బామర్ది’గా వెలుగొందిన శోభన్ బాబు కేవలం గొప్ప నటుడిగానే కాకుండా, క్రమశిక్షణ గల వ్యక్తిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ కూడా తన ఇమేజ్‌ను కాపాడుకుంటూ, సరైన సమయంలో రిటైర్మెంట్ ప్రకటించి చెన్నైలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. అయితే, ఆయన మరణానికి కొద్ది గంటల ముందు తన స్నేహితురాలు, సహనటి రాజశ్రీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

ఇది చదవండి: ప్రామిసరీ నోటు ఎలా రాయాలి.? ఎన్ని రూపాయల వరకు రాయొచ్చు..

రాజశ్రీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శోభన్ బాబుకి, తనకు మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మరణానికి ముందు ఆయన ఫోన్ చేసి ఎంతో ఆప్యాయంగా మాట్లాడారని, తన ఆరోగ్యం గురించి ఆరా తీశారని చెప్పారు. ఆయన గొంతులో ఎప్పుడూ ఉండే ఆ నిలకడ, స్పష్టత ఆ రోజు కూడా అలాగే ఉన్నాయని, కానీ అదే ఆయనతో చివరి మాట అవుతుందని తాను అస్సలు ఊహించలేదని రాజశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.

శోభన్ బాబు డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండేవారో, నలుగురికి సాయం చేయడంలోనూ అంతే ముందుండేవారని ఆమె తెలిపారు. ఆయన క్రమశిక్షణ, రియల్ ఎస్టేట్ పట్ల ఆయనకున్న అవగాహన అప్పట్లో తోటి నటీనటులకు ఎంతో మార్గదర్శకంగా నిలిచాయి. వెండితెరపై ఎందరో హీరోయిన్లతో నటించినా, వ్యక్తిగత జీవితంలో ఆయన పాటించిన విలువల వల్లే నేటికీ ఆయన అందరి గుండెల్లో చెరగని ముద్ర వేశారు. శోభన్ బాబు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సినిమాల ద్వారా, ఆయన పంచుకున్న ఆత్మీయత ద్వారా ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారని ఆమె అన్నారు.

ఇది చదవండి: మీ భూమి కబ్జాకు గురైందా? ఆస్తిని తిరిగి దక్కించుకోవడం ఈజీ.. ఈ ఒక్క పని చేస్తే చాలు..

Follow Us