
ఎట్టకేలకు అక్కినేని అఖిల్ ఖాతాలో సాలిడ్ హిట్టు పడింది. డైరెక్టర్ మురిళీ కిశోర్ అబ్బురి తెరకెక్కించిన లెనిన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు అఖిల్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా భారతి అనే పాత్రలో అద్భుతంగా ఒదిగిపోయింది. జూలై 10న థియేర్లలో విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా లెనిన్ చిత్రం భారీ విజయం సాధించి, బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచిన నేపథ్యంలో చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్స్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఈవెంట్లో తన ప్రసంగం సందర్భంగా ఆమె కన్నీరు పెట్టుకున్నారు, తన ప్రయాణాన్ని, సినిమా విజయాన్ని గుర్తుచేసుకుంటూ హృదయపూర్వకంగా మాట్లాడారు. అందరి కృష్ణ వల్లే ఈ సినిమా విజయం సాధించిందని అన్నారు. భాగ్య శ్రీ మాట్లాడుతూ, లెనిన్ సినిమాలో భారతి పాత్ర తనకు ఎంతో ప్రత్యేకమైనదని, ప్రేక్షకులలో ఒక విశేష స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ పాత్ర దోహదపడిందని పేర్కొన్నారు. ఈ విజయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ ఆమె తన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
ముఖ్యంగా, దర్శకుడు మురళి కిషోర్ సార్కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన తనకు భారతి పాత్రను ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు ఈ అప్రిసియేషన్ లభించేది కాదని అన్నారు. ఆయనకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. హీరో అఖిల్ అక్కినేని గురించి మాట్లాడుతూ, గత పదేళ్లుగా ఆయన ప్రయాణం తనకు తెలియకపోయినా, విషయాలు అనుకున్న విధంగా జరగనప్పుడు ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. అఖిల్ పడిన కష్టాన్ని తాను స్వయంగా చూశానని, ఆయన రక్తం, చెమట, కన్నీళ్లను ధారపోశారని తెలిపారు. ఒక్క సెకను కూడా విశ్రాంతి తీసుకోకుండా పనిచేశారని, అన్ని పనులు సక్రమంగా జరుగుతున్నాయని నిర్ధారించుకోవడానికి నిరంతరం కృషి చేశారని తెలిపారు. అఖిల్కు ఇంత ప్రేమ లభించడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో మళ్లీ కలిసి పనిచేయడానికి వేచి చూస్తుంటానని భాగ్యశ్రీ అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
వంశీ సార్కు ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచి స్క్రిప్ట్ను ఎంచుకోవడంలో ఆయన సహాయం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పారు. నాగ్ సార్ (నాగార్జున) గురించి మాట్లాడుతూ, సినిమా విడుదలైన కొద్ది గంటల ముందు ఆయనకు ఫోన్ చేసి, తాను చాలా నెర్వస్గా ఉన్నానని చెప్పినప్పుడు, కష్టపడితే ఎప్పుడూ ఫలితం ఉంటుంది అని ఆయన చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఆయన ఎంతో కృషి చేశారని, అందుకు తాను ఎల్లప్పుడూ కృతజ్ఞురాలినని అన్నారు. భవిష్యత్తులో కూడా ఆయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నానని భాగ్యశ్రీ తెలిపారు. చిత్రబృందంలోని ఇతర సభ్యులకు కూడా ఆమె తన కృతజ్ఞతలు తెలియజేశారు. చివరగా, తన అభిమానులకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తాను కిందపడిన ప్రతిసారి, వారి సందేశాలు, రీల్స్, నిరంతర ప్రోత్సాహం వల్లే తాను ఈ రోజు ఇక్కడ నిలబడగలిగానని భాగ్యశ్రీ అన్నారు. హైదరాబాద్ను తన కర్మభూమిగా భావిస్తున్నానని, తన చివరి చిత్రం కూడా ఇక్కడే చేయాలని ఆశిస్తున్నానని చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..