
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియరాలు లావణ్య హల్చల్ చేసింది. మద్యం మత్తులో రోడ్డుపైనే రచ్చ చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాపూర్ మండలం మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో లావణ్య ఢీ కొట్టింది. అంతేకాదు ఆ వ్యక్తిని పట్టించుకోకుండా ఆగకుండా వెళ్లిపోయే ప్రయత్నం చేసింది. దీంతో పోలీసులు లావణ్య కారును అడ్డుకున్నారు. అంతలో స్థానికులు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చారు. సారీ చెప్పాలని లావణ్యను అడిగారు. కానీ అందుకు ఆమె ససేమిరా అంది. దీంతో గొడవ కాస్తా మరింత పెద్దదైపోయింది. చివరకు పోలీసులతోనూ కాసేపు లావణ్య వాగ్వాదానికి దిగింది. అనంతరం ఆమెకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా డ్రంక్ అండ్ డ్రైవ్ పాజిటివ్ అని తేలినట్లు సమాచారం.దీంతో చివరకు పోలీసులు లావణ్య పై కేసు నమోదు చేశారు. ఆమె కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా లావణ్య కారులో మద్యం బాటిళ్లు చూసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
బ్రేకింగ్
ఇవి కూడా చదవండిమద్యం మత్తులో సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్ చల్
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పాజిటివ్ రావడంతో లావణ్యపై కేసు నమోదు చేసిన పోలీసులు
కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలింపు
మల్కాపూర్ (మం) మల్లెపల్లి వద్ద బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీ… pic.twitter.com/9c5n8v9G5V
— Telugu Feed (@Telugufeedsite) March 25, 2026