వాటికి నేను బాధ్యుడిని కాదు.. అజిత్ ప్రకటన

| Edited By:

Sep 18, 2020 | 5:35 PM

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అజిత్‌కి కోపం వచ్చింది. తన పేరును ఉపయోగించుకొని కొంత మంది మోసం చేస్తుండటం తన దృష్టికి వచ్చింది.

వాటికి నేను బాధ్యుడిని కాదు.. అజిత్ ప్రకటన
Follow us on

Ajith legal notice: ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే అజిత్‌కి కోపం వచ్చింది. తన పేరును ఉపయోగించుకొని కొంత మంది మోసం చేస్తుండటం తన దృష్టికి వచ్చింది. దీంతో అప్రమత్తమైన అజిత్‌.. ఓ ప్రకటనను విడుదల చేశారు. వాటితో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు. తన సినిమా, బిజినెస్‌ వ్యవహారాలన్నీ ఎప్పటి నుంచో మేనేజర్ సురేష్‌ చంద్ర చూసుకుంటున్నారని ఆ ప్రకటనలో తెలిపారు. మరెవరైనా తన పేరుతో కాంటాక్ట్ అయితే వాటికి దూరంగా ఉండాలని, అందుకు తాను బాధ్యుడిని కాదని వివరించారు.

కాగా ప్రస్తుతం అజిత్‌ హెచ్‌. వినోద్ దర్శకత్వంలో ‘వలిమై’ చిత్రంలో నటిస్తున్నారు. బోని కపూర్ నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్‌ 50 శాతం పూర్తి అయ్యింది. కరోనా నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్‌కి బ్రేక్ రాగా.. అక్టోబర్ చివర్లో గానీ, నవంబర్‌లో గానీ తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలని మూవీ యూనిట్ ఆలోచిస్తోంది. ఈ మూవీ తరువాత శివ దర్శకత్వంలో అజిత్‌ ఐదో సారి నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Read More:

10వేల ఎకరాల భూమికి నీరు.. కార్తిపై సర్వాత్రా ప్రశంసలు

9 ఏళ్ల క్రితం చిత్రం.. ఆర్యపై పరువు నష్టం దావా కేసు