బిగ్బాస్ సీజన్ 8 ఇప్పుడు ఏడో వారం ఎలిమినేషన్ సమయం దగ్గరపడింది. ఈ వారం గౌతమ్, నిఖిల్, పృథ్వీ, యష్మి, తేజ, నబీల్, మణికంఠ, ప్రేరణ, హరితేజ నామినేషన్లలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ వారం మొదటి నుంచి హరితేజ అతి తక్కువ ఓటింగ్ తో డేంజర్ లో కొనసాగింది. కానీ ఇప్పుడు ఏడో వారం షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్లు తెలుస్తోంది. గత వారం కిర్రాక్ సీత ఎలిమినేట్ కాదా.. ఈసారి కూడా ఓజీ క్లాన్ నుంచి ఓ కంటెస్టెంట్ బయటకు వచ్చినట్లు సమాచారం. వీరిలో అత్యంత ఎక్కువ ఓటింగ్ తో టాప్ లో దూసుకుపోతున్నాడు నిఖిల్. మొదట్లో సైలెంట్ అయిన నిఖిల్ ఇప్పుడు టాస్కులలో అదరగొట్టేస్తున్నాడు. ఇక నబీల్ గురించి చెప్పక్కర్లేదు. గత మూడు వారాలుగా ఓటింగ్లో బీభత్సం సృష్టిస్తున్నాడు. టాస్కులు, ప్రవర్తనతో రోజు రోజుకు నబీల్ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఇక యష్మి, ప్రేరణ, గౌతమ్ వీరి ముగ్గురికి కూడా ఓ మేరకు ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది.
అయితే ఈ వారం ఎవరూ ఊహించని విధంగా మణికంఠ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆదివారం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యిందని.. ఆ ఎపిసోడ్ లో మణికంఠ ఎలిమినేట్ అయ్యాడనే విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. యష్మి, ప్రేరణ, గౌతమ్ ముగ్గురు సేఫ్ అయిన తర్వాత పృథ్వికి, హరితేజకు ఓటింగ్ లో స్పల్పంగా మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ వారం టాస్కులలో పృథ్వీ, హరితేజ అదరగొట్టేశారు. దీంతో ఇద్దరికి ఓటింగ్ పెరిగింది.
ఇక ఈ వారం మణికంఠ టాస్కులలో అంతగా ఆడినట్లు కనిపించలేదు. అసలు ఛార్జింగ్ టాస్కులో నేను ఆడను… బొక్కలు ఇరగ్గొట్టుకోను అంటూ ముందే చేతులు ఎత్తేశాడు. అలాగే కావాలనే అందరితో గొడవ పెట్టుకోవడం.. ఆట ఆడకుండా ఊరికే కూర్చోవడంతో మణికంఠకు ఓటింగ్ తగ్గిపోయింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ కు ముందు మణికంఠ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి వెళ్లిపోతాను.. నా మైండ్, హార్ట్ అసలు బాలేదు అంటూ మణి చెప్పాడట. దీంతో ఎలిమినేషన్ రౌండ్ కు మణితోపాటు గౌతమ్ కూడా రాగా.. ఓటింగ్ ప్రకారం ఇద్దరిలో మణికంఠ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారని.. ఆ విధంగా మణి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఇది చదవండి :
Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?