సైఫ్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ విలన్.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు.. 

|

Dec 06, 2020 | 6:09 PM

ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. 'ఆదిపురుష్' సినిమా గురించి సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు

సైఫ్‏ను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. క్షమాపణలు చెప్పిన ఆదిపురుష్ విలన్.. ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనుకోలేదు.. 
Follow us on

ప్రభాస్ నటిస్తోన్న ఆదిపురుష్ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‏తో టీ-సిరీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో తెరకెక్కించి, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోకి అనువాదం చేయనున్నారు. అయితే ఆదిపురుష్ సినిమా గురించి సైఫ్ అలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలతో నెటిజన్లు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

‘ఆదిపురుష్’ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం గురించి ఓ మీడియాతో సైఫ్ మాట్లాడుతూ.. ఈ మూవీలో రావణుడిలోని మరో కోణాన్ని, మానవత్వాన్ని చూపించబోతున్నాం. తన చెల్లికి జరిగిన అవమానానికి బదులుగా సీతను రావణుడు ఎత్తుకెళ్ళడం కరెక్టే.. అనేలా ఈ చిత్రికరించబోతున్నామని తెలిపాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ మాట్లాడిన మాటలు అతడిని వివాదాల్లోకి నెట్టాయి.

తాజాగా సైఫ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకుడు రామ్ కదంతోపాటు మరికొందరు తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ఆయన మాటలు షాక్‏కు గురిచేశాయని రామ్ కదం ట్వీట్ చేశారు. రావణుడిని మంచివాడిగా తెరపై చూపిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనిపై సైఫ్ స్పందిస్తూ.. ఇతరుల మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని తెలిపారు. వాస్తవ కథను వక్రీకరించకుండా సినిమాను తెరకెక్కించబోతున్నారని స్పష్టం చేశారు. “నేను ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కొందరి మనోభావాల్సి దెబ్బతీశాయని, వివాదానికి తెరతీశాయని తెలిసింది. నా ఉద్దేశం ఏ మాత్రం కాదు. ఇందుకు ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నా, నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నా. రాముడు ధర్మానికి, వీరత్వానికి చిహ్నంగా నేను భావిస్తాను. చెడుపై మంచి సాధించిన విజయం చుట్టూ ఆదిపురుష్ సినిమా ఉంటుంది. కథను వక్రీకరించకుండా ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని తీసే దిశగా మొత్తం చిత్రయూనిట్ శ్రమిస్తోంది” అని సైఫ్ వివరించారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ 2020 ఆగస్టు 11న విడుదల కాబోతోంది.