బస్టాండ్‌లో సాయి పల్లవి.. ఎవ్వరూ గుర్తుపట్టకుండా..

| Edited By:

Sep 05, 2019 | 1:06 PM

‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ‘విరాటపర్వం’ ఒకటి. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రానా హీరోగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వరంగల్ జిల్లాలో జరుగుతోంది. ఇక షూటింగ్‌లో భాగంగా పరకాల బస్టాండ్‌లో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఈ సన్నివేశంలో సాయి పల్లవి నటించగా.. లంగా, ఓణీ వేసుకున్న ఆమె ఓ సాధారణ ప్రయాణికురాలిగా […]

బస్టాండ్‌లో సాయి పల్లవి.. ఎవ్వరూ గుర్తుపట్టకుండా..
Follow us on

‘ఫిదా’ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం తెలుగులో పలు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ‘విరాటపర్వం’ ఒకటి. ‘నీది నాది ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో రానా హీరోగా కనిపించనున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వరంగల్ జిల్లాలో జరుగుతోంది. ఇక షూటింగ్‌లో భాగంగా పరకాల బస్టాండ్‌లో ఓ సన్నివేశాన్ని తెరకెక్కించాడు దర్శకుడు. ఇక ఈ సన్నివేశంలో సాయి పల్లవి నటించగా.. లంగా, ఓణీ వేసుకున్న ఆమె ఓ సాధారణ ప్రయాణికురాలిగా అక్కడ కూర్చొని బస్ రాగానే వెళ్లిపోతుంది. అయితే అక్కడికి ఆమె చాలా సాధారణంగా రావడంతో మొదట ఎవ్వరూ గుర్తుపట్టలేకపోయారు.

ఇక మరోవైపు సాయి పల్లవిని స్థానికులు గుర్తిస్తే ఇబ్బందులు రావొచ్చనే ఆలోచనతో బస్టాండ్ ఎదురుగా ఉన్న లాడ్జ్ నుంచి ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే ఇంతలోపే ఎవరో ఆమెను గుర్తుపట్టి ఫొటో తీయగా.. అక్కడే ఉన్న షూటింగ్ సభ్యులు ఆ దృశ్యాలను బలవంతంగా తొలగించారు. మరికొందరు ప్రయాణికులు ఫొటోలు తీసుకునే లోపు.. సాయి పల్లవి షూటింగ్ పూర్తి చేసుకొని సొంత వాహనంలో కాళేశ్వరం వెళ్లిపోయింది. ఈ క్రమంలో సాయి పల్లవిపై ఓ ప్రయాణికుడు తీసిన ఆరు సెకన్ల వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా వైవిధ్య కథాంశంతో తెరకెక్కుతోన్న విరాట పర్వంను ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.