వర్మకు కాలింది..నడి రోడ్డుపై ప్రెస్ మీట్

|

Apr 28, 2019 | 11:23 AM

ఎట్టకేలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  ఎన్నికల అయిపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం వర్మ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు.  దీంతో సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకునేందుకు వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.  కానీ హోటల్ యాజమాన్యం వర్మ బుకింగ్ క్యాన్సిల్ చేశారట. ఆ తర్వాత హోటల్ ఐలాపురంలో నిర్వహించాలనుకున్నారు. అక్కడ నుంచి క్యాన్సిల్ ఫోన్ కాల్ వచ్చిందంంట. అది కూాాడా అడ్వాన్స్ […]

వర్మకు కాలింది..నడి రోడ్డుపై ప్రెస్ మీట్
Follow us on

ఎట్టకేలకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని ఏపీలో విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.  ఎన్నికల అయిపోవడంతో కోర్టు ఉత్తర్వుల ప్రకారం వర్మ సినిమా రిలీజ్ చేసుకోవచ్చు.  దీంతో సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకునేందుకు వర్మ విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు.  కానీ హోటల్ యాజమాన్యం వర్మ బుకింగ్ క్యాన్సిల్ చేశారట. ఆ తర్వాత హోటల్ ఐలాపురంలో నిర్వహించాలనుకున్నారు. అక్కడ నుంచి క్యాన్సిల్ ఫోన్ కాల్ వచ్చిందంంట. అది కూాాడా అడ్వాన్స్ తీసుకున్నాక.

దీంతో ఆగ్రహించిన వర్మ ఒక వ్యక్తికీ భయపడి హోటల్ యాజమాన్యం బుకింగ్ క్యాన్సిల్ చేసింది.  హోటళ్లు, క్లబ్బుల మేనేజిమెంట్స్ మనందరికీ తెలిసిన ఒక వ్యక్తికి భయపడుతున్నారు.  అందుకే ఈరోజు సాయంత్రం విజయవాడలోని పైపుల రోడ్డులో నడిరోడ్డు మీద సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెడుతున్నా.  మీడియా మిత్రులకి, ఎన్టీఆర్ అభిమానులకి, నా మీద కోద్దో, గొప్పో ఇష్టం ఉన్న వారికి నా బహిరంగ ఆహ్వానం అంటూ ట్వీట్ చేశారు.